*విద్యార్థుల ఇష్ట ప్రకారమే పాఠశాల నడపాలి…!*
*క్షేత్రస్థాయిలో సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి
*జిల్లా ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
*దళితుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి
*మధ్యాహ్న భోజనం పెట్టకపోవడం అన్యాయం*
*విద్యార్థుల హక్కులను హరించరాదు
*పాఠశాల కోసం విద్యార్థులు పోరాటం బాధాకరం*
*ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు
*గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 25( ప్రశ్నఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
విద్యార్థుల ఇష్ట ప్రకారమే పాఠశాల నడపాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పి.ఏ.ఏ.పి)., కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలక రంజిత్ కుమార్, నియోజకవర్గం ఓబీసీ చైర్మన్ సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు తదితరులు రోడ్డు ప్రమాదంలో గాయపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బలిజిపేట మండలంలోని పెదపెంకి ఎస్సీ వీధి పాఠశాలతో పాటు, పాలగర గ్రామంలోని గుడివాడ కొట్టిశ పాఠశాల మార్పు విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. కొన్ని పరిస్థితుల్లో క్షేత్రస్థాయి సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఇష్టా అయిష్టాలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. పాఠశాలల మార్పు వలన తమ పిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు భయపడుతుంటే వారి మాటలు కాదని పాఠశాలలో మార్పు చేయటం సరికాదన్నారు. తక్షణమే క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను పరిగణించి వారు కోరిన చోటే పాఠశాలలో నడపాలన్నారు. తమ పిల్లల టీసీలు తీసుకునే స్థాయికి వచ్చారంటే అక్కడ పరిస్థితి తీవ్రతను తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా దళిత వీధికి చెందిన పిల్లలను బీసీ వీధి పాఠశాలకు పంపించేందుకు వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ పిల్లలు వివక్షతకు గురయ్యే అవకాశం ఉందన్న వారి ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయంలో దళితుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పాఠశాలల ప్రారంభం నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోవడం అన్యాయం అన్నారు. విద్యార్థులు కోరుకునే చోట పాఠశాల నడపకపోవడం, వారికి మధ్యాహ్న భోజనం పెట్టకపోవడం వారి హక్కులకు భంగం కలిగించినట్లే అన్నారు. ముక్కు పచ్చలారని చిన్నపిల్లలయిన విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పాఠశాల కోసం పోరాటం చేయటం బాధాకరమన్నారు. జిల్లాలో విద్యాశాఖ పరిస్థితి ఎప్పటికే ఆరోపణలు మూటగట్టుకుంటుందోన్నారు. ఆయా పాఠశాలల మార్పు విషయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి గత కొంతకాలంగా వ్యతిరేకత ఎదురవుతున్నా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదానికి ఎవరు జవాబుదారీ…? అని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో జరగకూడనిది ఏమైనా జరిగితే ఆ నష్టాన్ని ఎలా పూడ్చగలరని ప్రశ్నించారు. అధికారులు పెట్టే ఈ ఇబ్బందుల వల్ల, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను విడిచిపెట్టి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే ఆలోచన కల్పించడం బాధాకరమన్నారు. తక్షణమే విద్యార్థుల కోరిన చోట పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగ శివ జ్యోతి తో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని కోరారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలో అందిస్తున్న మెనూ పరిశీలించారు. రోగులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమం తమ పార్టీ ఇంచార్జ్ బత్తిని మోహన్ రావు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు.