Site icon PRASHNA AYUDHAM

తెలంగాణలో రెండో రోజు గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతం గా ముగిశాయి..

IMG 20241022 WA0027

తెలంగాణలో రెండో రోజు గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతం గా ముగిశాయి..

హైదరాబాద్ డెస్క్:
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:

తెలంగాణలో తొలిరోజు నిర్వహించిన గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతం గా ముగిశాయి, తొలిరోజు పరీక్షకు 31, 383మంది అభ్యర్థులు హాజరయ్యారు.
తెలంగాణలో రెండో రోజు గ్రూప్-1 పరీక్షలు కొనసాగనున్నాయి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల వరకూ అభ్యర్థు లను పరీక్ష హాలులోకి అనుమతించనుండగా.. నిమిషం ఆలస్యం అయినా.. పరీక్షకు అనుమ తించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
తొలిరోజు 22 వేల 744 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. మొత్తంగా 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా నిన్న ఒక్క నిమిషం ఆలస్యమైన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షకు దూరం అయ్యారు.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా కొనసాగింది. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించక పోవడం మినహా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కర ఘటనలు జరగలేదని టీజీపీఎస్పీ పేర్కొంది.
హైదరాబాద్ పరిధిలోనే 5 వేల 613 మంది పరీక్ష రాయాల్సి ఉండగా కేవలం 87.23 శాంతం అంటే 4 వేల 896 మంది మాత్రమే పరీక్ష రాశారు. మరో 717 మంది గైర్హాజరయ్యారు. రంగారెడ్డి పరిధిలో 8 వేల 11 మందికి గాను 5 వేల 854 మంది ఎగ్జామ్ రాశారు.
మరో 2 వేల 157 మంది పరీక్షకే రాలేదు. ఈ నెల 27వరకు గ్రూప్ 1 మెయిన్స్ కొనసాగానున్న నేపథ్యంలో అన్ని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, టీజీపీఎస్పీ, భావిస్తోంది.

Exit mobile version