తుది దశకు చేరుకున్న బీజేపీ రెండవ దశ సభ్యత్వ నమోదు కార్యక్రమం..

తుది దశకు చేరుకున్న బీజేపీ రెండవ దశ సభ్యత్వ నమోదు కార్యక్రమం..


-ప్రతి ఇంటికి తిరిగి బీజేపీ సభ్యత్వం చేయించాలి

-100 మంది ప్రాథమిక సభ్యత్వం చేస్తేనే క్రియాశీల సభ్యత్వానికి అర్హులు

-బూత్ కి 100 చొప్పున సభ్యత్వం తప్పనిసరి

కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20:

కామారెడ్డి జిల్లా కార్యాలయంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ గత నెల నరేంద్ర మోది గారి చే ప్రారంభించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండవ దశ కి పూర్తి కావస్తుందని కావున బీజేపీ కార్యకర్త ప్రతి ఇంటికి తిరిగి బీజేపీ సభ్యత్వం చేయించాలనీ అన్నారు. 100 మంది ప్రాథమిక సభ్యత్వం చేస్తేనే క్రియాశీల సభ్యత్వానికి అర్హులు అని కావున పార్టీ భాద్యతలు అన్న ప్రతి ఒక్కరూ 100 మంది చే సభ్యత్వం చేయించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నరేంద్ర మోదీ గారి సుపరిపాలన ప్రజలకు వివరించి జాతీయ భావాలు కలిగిన ప్రతి ఒక్కరితో సభ్యత్వం చేయించాలని, బూత్ కి 100 చొప్పున సభ్యత్వం తప్పనిసరి చేయించాలని అన్నారు.

Join WhatsApp

Join Now