ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 3 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో శ్రీపాద రావు గారి 88వ జయంతి వేడుకలు జరిగాయి.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏరియా ఐ ఎన్ టి యు సి నాయకులు వత్సవాయి కృష్ణంరాజు
ఉమ్మడి రాష్ట్ర మాజీ శాసనసభాపతి ప్రజా నాయకులు స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు సేవలు చిరస్పరణీయమని నేటి తరానికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి)ఏరియా ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం మణుగూరు మండలం సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో సింగరేణి ఆర్జీవన్ జిఎం డి లలిత్ కుమార్ ప్రముఖ జర్నలిస్ట్ అనిత దంపతుల సహకారంతో దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాద రావు 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పిల్లలకు సహపంక్తి భోజనాలు, బిస్కెట్లను అందజేశారు. కార్యక్రమానికి ముందు శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ రాజకీయాలలో ప్రారంభోత్సవాలు చేసిన నాయకుల పేర్లు శిలాఫలకాలపై లిఖించబడతాయని కానీ ప్రజలలో మమేకమై ప్రజల అభివృద్దే తమ అభివృద్ధిగా భావించి ప్రజలకు సేవ చేసిన నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అనటానికి దుద్దిళ్ళ శ్రీపాదరావు ఒక గీటురాయి అని తండ్రి శ్రీపాదరావు కాలం నుండి మంత్రి నేటి శ్రీధర్ బాబు గారి వరకు మంథని శాసనసభ్యులుగా అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్న దుద్దిళ్ళ వారి కుటుంబ సభ్యులనే తమ నేతలుగా ప్రజలు ఎన్నుకుంటున్నారు అంటే ప్రజలలో శ్రీపాద రావు ఎంతటి ప్రభావం కలిగిన నేతనో మనకు అర్థం అవుతుందని నేటి రాజకీయ నాయకులకు ఆయన స్ఫూర్తిదాయకం కావాలని ఆయన ఆకాంక్షించారు, శ్రీపాద రావు సేవలు చిరస్మరణీయమని ఆయన ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు, మార్చి 2 శ్రీపాద రావు గారి జయంతి వేడుకలు అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సముచిత నిర్ణయంగా ఆయన అభివర్ణించారు,అనంతరం చిన్నారులకు సహ పంక్తి భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్న లలిత్ కుమార్ గారు అనిత మేడం దంపతులకు వారి మిత్ర బృందానికి విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు, సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా సమన్వయకర్తగా వ్యవహరించగా , ఐ ఎన్ టి యూస్ నాయకులు పసులూరి రామారావు, సేవా సమితి సభ్యులు ఏ మంగీలాల్,శ్రీ విద్యాభ్యాస పాఠశాల కరస్పాండెంట్ బి జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు , స్వాతి, సిబ్బంది సుజాత,రాధ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ శాసనసభాపతి దుద్దిళ్ళ శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం
by Naddi Sai
Published On: March 3, 2025 6:21 pm
