*సీనియార్టీ పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుని కాదని వెనుక వచ్చిన కొత్తవారిని పర్మినెంట్ చేయడం పట్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం*
*రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది*
*నచ్చచెప్పి వాటర్ ట్యాంక్ దింపిన ట్రైన్ ఎస్సై దీపక్ కుమార్*
*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 24 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడైన పర్లపల్లి మల్లేష్ గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నాదాని కాగా తన తరువాత విధుల్లో చేరిన కొందరు కార్మికులని పెర్మనెంట్ చేస్తున్నారని అనే ఉద్దేశం తో మనస్తాపం చెంది శ్రీరాములపల్లి గ్రామం లో గల వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కి గడ్డి మందు తాగుతానని ఆత్మ హత్య చేసుకుంటానని నిరసన తెలిపినాడని సమాచారం తెల్సుకున్న ఇల్లందకుంట ఎస్సై దీపక్ కుమార్ తన సిబ్బంది తో అక్కడకి చేరుకొని బాధితున్ని నచ్చచెప్పి అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకి దింపి చికిత్స నిమ్మితం హాస్పిటల్ పంపించడం జరిగిందని తెలిపారు బాధితుని వివరాలు అడగగా గత 15 సంవత్సరాలుగా పారిశుద్ధ కార్మికుడిగా గ్రామంలో పనిచేస్తున్న నన్ను కాదని నా కన్నా వెనుక వచ్చిన కార్మికునికి పర్మినెంట్ చేయడానికి తన వద్ద డబ్బులు తీసుకొని నాపై కక్ష సాధిస్తున్నారని తెలిపారు ఉన్నతాధికారులు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు