*ప్రభుత్వ పాఠశాల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం*
*వెంటనే సమస్యలను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వెయ్యాలి*
*బిఆర్ఎస్వి నాయకులు జువ్వాజి అనిల్*
*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 25 ప్రశ్న ఆయుధం*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని బిఆర్ఎస్వి నాయకులు జవ్వాజి అనిల్ ఆరోపించారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో బిఆర్ఎస్వి నాయకులు చిన్న కోమటిపల్లి పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఉపాధ్యాయులను విద్యార్థులను అడిగి తెలుసుకొని బిఆర్ఎస్వి నాయకుడు జవ్వాజి అనిల్ మాట్లాడుతూ బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను బిఆర్ఎస్వి తలపెట్టిన బడిబాట కార్యక్రమంలో సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు విద్యార్థులను అడిగి తెలుసుకొని ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్న ప్రభుత్వం పాఠశాలల పట్లా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు ప్రభుత్వం ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఏంటని ప్రశ్నించారు పాఠశాలలో అనేక ఇబ్బందులు ఉన్నాయని టాయిలెట్స్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా రాగిజావను అందించేవారని కానీ ఈ ప్రభుత్వంలో, ఇప్పటికే పాఠశాల ప్రారంభమై 14 రోజులు గడుస్తున్న బ్రేక్ ఫాస్ట్ అందించడంలో విఫలమయ్యారని గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ లు ఉండేవని ఆ కమిటీల ద్వారా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యేవని కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళా సంఘాల సీఏ లకు బాధ్యతలు అప్ప చెప్పి చేతులు దులుపుకున్నారన్నారు గత ప్రభుత్వం కల్పించిన వసతులు తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సమస్యలు ఇలానే ఉంటే బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలోబిఆర్ఎస్వి నాయకులు,చింతల కౌశిక్, మహంకాళి రాజు, చతల రంజిత్, శేషు,ప్రశాంత్, వెనిశెట్టి నాగరాజు, మూడేడ్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు