Site icon PRASHNA AYUDHAM

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభం

IMG 20251019 204658

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభం

కామారెడ్డి శిశుమందిర్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ (సి.హెచ్. శ్రీనివాస్ స్మారక) కబడ్డీ క్రీడలు అట్టహాసంగా ప్రారంభం

కార్యక్రమాన్ని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సి.హెచ్. రాజు నిర్వహించారు

ముగింపు కార్యక్రమం రేపు సాయంత్రం జరగనుంది

విజేతలకు రూ.20,000, రన్నరప్‌కు రూ.10,000, తృతీయ స్థానం వారికి రూ.5,000 నగదు బహుమతులు, షీల్డ్లు, వ్యక్తిగత బహుమతులు అందజేయనున్నారు

మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి, SGF సెక్రటరీ హీరాలాల్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి, అక్టోబర్ 19

శిశుమందిర్ క్రీడా ప్రాంగణంలో రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ సి.హెచ్. శ్రీనివాస్ స్మారక కబడ్డీ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సి.హెచ్. రాజు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి. రెండు రోజులపాటు కొనసాగే ఈ కబడ్డీ క్రీడల్లో వివిధ జిల్లాల నుంచి జట్లు పాల్గొంటున్నాయి.

రేపు సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతులు, షీల్డ్లు, వ్యక్తిగత పురస్కారాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచే ఆటగాళ్లు భవిష్యత్తులో జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో SGF సెక్రటరీ హీరాలాల్, కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version