నాగారంలో కట్ట మైసమ్మ తల్లి, మానస దేవి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా

**నాగారంలో కట్ట మైసమ్మ తల్లి, మానస దేవి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా**

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 20

నాగారం పట్టణంలో కట్ట మైసమ్మ తల్లి మరియు శ్రీ మానస దేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిన్న భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఆయనతో పాటు రాళ్ల అశోక్ యాదవ్, కృష్ణ యాదవ్, నాగేందర్, మాజీ వార్డు మెంబర్ కౌకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి గౌడ్, మామిళ్ల శ్రీనివాస్, సత్యనారాయణ, రామ్ రెడ్డి తదితర గ్రామ పెద్దలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ఆలయం ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment