నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ మాత్రం 24 వేల మార్కు ఎగువన ముగిసింది.
సెన్సెక్స్ ఇంట్రాడేలో దాదాపు 900 పాయింట్లు కోల్పోయి 79,109.73 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
చివరికి 720.60 పాయింట్ల నష్టంతో 79,223.11 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 207.25 పాయింట్ల నష్టంతో 23,981.40 వద్ద ముగిసింది.
డాలరుతో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు క్షీణించి 85.78 వద్ద స్థిరపడింది.