మున్నూరు కాపు మండల కమిటీ ఎన్నికలో ఏకగ్రీవం

*మున్నూరు కాపు మండల కమిటీ ఎన్నికలో ఏకగ్రీవం*

IMG 20250417 WA2740

ఆయుధం న్యూస్ ఏప్రిల్ 17 కామారెడ్డి జిల్లా గాంధారి

మున్నూరు కాపు సంఘం, మండల పట్టణ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మున్నూరు కాపు పటేల్ సంఘం సభ్యులు తెలిపారు. గురువారం గాంధారి మండల కేంద్రంలో సమావేశమైన మున్నూరు కాపు కులస్తులు, మండల, పట్టణ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గాంధారి మండలం మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఆకుల బాలకిషన్, ఉపాధ్యక్షులుగా, సింగసాని పండరి, పత్తి శివకుమార్, కూచి గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా ఉప్పు సాయిలు, కోశాధికారిగా తాడ్వాయి విట్టల్, జాయింట్ సెక్రటరీగా గోనే వెంకట్, గాంధారి పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా పత్తి సాయిలు, ప్రధాన కార్యదర్శి తాడ్వాయి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులుగా బండారి రమేష్, పత్తి రవి, కోశాధికారిగా పౌలింగ్ నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ మండలంలో మున్నూరు కాపు కులస్తుల అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం పెద్దలు తాడ్వాయి సంతోష్, ఆకుల లక్ష్మణ్, బిట్ల గంగాధర్, గోపాల్, ఆకుల సాయిలు, ఎల్లు రామస్వామి, చిరుకూరి రవి, ఆకుల రమేష్, నేరెళ్ల మధు, బాలయ్య, తడువాయి నరేష్, మరియు మున్నూరు కాపు సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now