*ఏజెన్సీలో పులి కలకలం!*
*ప్రజలను అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు*
*పాదముద్రల ఆధారంగా* *గుర్తించే ప్రయత్నం*
*కొత్తగూడ ఎఫ్ ఆర్ ఓ వజహత్..*
కొత్తగూడ : ఏజెన్సీలో చాలా రోజుల తరువాత పులి సంచరిస్తుందనే సమాచారం గిరిజన ప్రాంత ప్రజల్లో కలకలం రేపింది. మండలంలోని ఊటాయి,కొనపూర్,సాధిరెడ్డి పల్లి పరిధిలోని ఉన్న అటవీ ప్రాంతాన్ని డీ ఎఫ్ ఓ విశాల్, ఎఫ్ డీ ఓ చంద్రశేఖర్ లా ఆదేశాలమేరకు నర్సంపేట రేంజ్ పరిధిలోని నీ మూడు చుక్కలపల్లి పరిధిలో ఉన్నటువంటి కొత్తగూడ రేంజ్ అటవీ ప్రాంతాన్ని కొత్తగూడ రేంజ్ అధికారి వజహత్ నేతృత్వంలో ఆ ప్రాంతాలాన్ని క్షుణంగా పరిశీలించారు..అటవీ జంతు వు ఈ ప్రాంతంలో తిరిగినట్టు ఏమైనా పాదముద్రలు ఉన్నాయా? ఏ జంతువు అనేది వాటి పాదముద్రల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అవసరమైతే అనుమానాస్పద ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు పెడతామన్నారు. అలాగే కోనాపూర్,సాధిరెడిపల్లి, ఓటాయి , సమీప గ్రామప్రజలు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కొత్తగూడ రేంజర్ వజహత్ సూచించారు… ఈ కార్యక్రమం లో డి ఆర్ ఓ కరుణ,సెక్షన్ ఆఫీసర్ రాజేష్,బీట్ ఆఫీసర్లు వేణు,సతీష్,తదితరులు పాల్గొన్నారు…