జర్నలిస్టుల సంక్షేమమే మన తిరుపతి ప్రెస్ క్లబ్ ముఖ్య ద్యేయం

 

జర్నలిస్టుల సంక్షేమమే మన తిరుపతి ప్రెస్ క్లబ్ ముఖ్య ద్యేయం

-ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని జర్నలిస్టులకు పిలుపు

-ప్రెస్ క్లబ్ నూతన సభ్యత్వ నమోదును జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి

-మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళి రెడ్డి

తిరుపతిలోని లీలామహల్ సర్కుల వద్ద ఉన్న మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు సోమవారం వ్యవస్థాపకులు తపసి మురళి రెడ్డి అధ్యక్షతన మన తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శేషాద్రి యాదవ్ ఆధ్వర్యంలో పాత్రికేయ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.గతంలో సభ్యత్వం తీసుకొని ప్రస్తుతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయని వారిని గుర్తించి మన తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యత్వం నుండి తొలగించడం జరిగింది.మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రస్తుతం ఉన్న కార్యవర్గంలో స్వల్ప మార్పులు చేస్తూ వర్కింగ్ జర్నలిస్టులకు నూతన గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు పది లక్షల రూపాయలు ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య భీమా సదుపాయం ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది.మన తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకున్న జర్నలిస్టులపై విధి నిర్వహణలో ఎవరైనా బెదిరింపులు,దాడులకు పాల్పడితే జర్నలిస్టులకు భరోసా కలిగించే విధంగా దాడి చేసిన వ్యక్తులకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే విధంగా పోరాడుతామని తెలియజేశారు. మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలం కేటాయించే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని తెలియజేశాను. మన తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా యువతి, యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది.జనవరిలో మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. అనంతరం సభ్యత్వం పొందిన పాత్రికేయ సభ్యులు మాట్లాడుతూ మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం పొందినందుకు చాలా సంతోషంగా ఉందని, జర్నలిస్టుల సంక్షేమం గురించి వ్యవస్థాపకులు తపసి మురళి రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.ఈ అవకాశాన్ని ప్రతి జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now