*మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కావాలి*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూలై 10
పుస్తకావిష్కరణ సభలో మాజీ మాత్స్య శాఖ ఫెడరేషన్ ఛైర్మెన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ పిలువు.మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కావాలి.పుస్తకావిష్కరణ సభలో పిట్టల రవీందర్ ముదిరాజ్ పిలువుఇచ్చారు. *లింగంపేట* *మండలంలోని “రైతు వేదికలో జరిగిన జాతీయ మాత్స్య రైతుల దినోత్సవం* ” కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
దాదాపు ఆరు దశాబ్దాలపాటు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ మత్స్యరంగంలో అపారమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని,అందిపుచ్చుకుని రాష్ట్రంలోని సాంప్రదాయ మత్స్యకారులు లక్షాధికారులుగా మారేందుకు ప్రయత్నించాలని తెలంగాణ రాష్ట్రమత్స్యసహకార సంఘాల సమాఖ్య (ఫిషరీస్ ఫెడరేషన్) మాజీ చైర్మెన్ మరియు తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. గురువారంనాడు కామారెడ్డి జిల్లా లింగంపేట మండల మత్స్యసహకార సంఘాల ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో నిర్వహించిన ‘జాతీయ మత్స్యరైతుల దినోత్సవం’ సందర్భంగా ఆయన వెలువరించిన ‘తెలంగాణ మత్స్యరంగం – సమగ్ర అభివృద్ధి – కీలక అంశాలు’ పుస్తకాన్ని స్థానిక మత్స్యకారులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం పిట్టల రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ మత్స్యరంగం సమగ్ర అభివృద్ధికి ఈ పుస్తకం ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. కేవలం నీటి వనరుల అభివృద్ధి, చేపల ఉత్పత్తిలో పెరుగుదల మరియు ప్రభుత్వ పథకాల అమలు తో మాత్రమే మత్స్యరంగం అభివృద్ధి చెందినట్లుకాదని, తరతరాలుగా అన్నిరంగాలలో ఎంతో వెనకబడి పోయిన సాంప్రదాయ మత్స్యకారుల కుటుంబాలు ఆధునిక ప్రపంచంలో సమభాగస్వాములు అయినప్పుడు మాత్రమే మత్స్యరంగం సమగ్రంగా అభివృద్ధి చెందినట్లుగా భావించాలని అన్నారు.
గత ప్రభుత్వ పాలనాకాలంలో తెలంగాణ మత్స్యరంగం అభివృద్ధికి కొంతమేరకు ప్రయత్నాలు జరిగినప్పటికీ మత్స్యశాఖలో పేరుకుపోయిన అవినీతి, అలక్ష్యం, ఆధునిక విధానాలపట్ల అవగాహన లేకపోవడం లాంటి అనేకానేక కాకరణాలవల్ల ఆశించిన ఫలితాలు దక్కలేదని, మత్స్యరంగం అభివృద్ధి కోసం అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయలను పథకాల పేరిట ఖర్చు చేసినప్పటికీ అధికారుల అవినీతి మరియు మత్స్యకారుల్లో అవగాహన రాహిత్యం తదితర కారణాల వల్లమత్స్యకారుల జీవితాలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని పిట్టల రవీందర్ ముదిరాజ్, అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకాలం తరువాత మత్స్యశాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమించడం, ఆ రంగం అభివృద్ధి విషయంలో ఆలోచించడం ప్రారంభించినట్లు కనిపిస్తున్నదని, అయితే ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగం అభివృద్ధికి తీసుకోబోయే కార్యాచరణపై ఆధారపడి ప్రభుత్వ పనితీరును అంచనా వేయగలగుతామని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా మత్స్యశాఖకు మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరి మత్స్యకార కులాల ప్రతినిధిగా రావడం హర్షించదగిన పరిణామమని, రాష్ట్రంలోని మత్స్యసహకార సంఘాలు, మత్స్యకారులు ఆయనకు సంపూర్ణ సహకారాన్ని, మద్దతును అందించినప్పుడే ఈ రంగానికి ప్రభుత్వం ద్వారా మేలుకలుగుతుందని పిట్టల రవీందర్ ముదిరాజ్ అభిప్రాయపడ్డారు. కామారెడ్డి జిల్లా మత్స్యకారుల ప్రతినిధి డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ ఆధ్యక్షతన జరిగిన జాతీయ మత్స్యరైతుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు డాక్టర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్, సాయిబాబా ముదిరాజ్, బాలయ్య ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, పోతాయిపల్లి బాలయ్య ముదిరాజ్, నారాయణ ముదిరాజ్, పోల్కంపేట రవి ముదిరాజ్, లక్ష్మినారాయణ ముదిరాజ్,వివిధ, గ్రామాల, మండలాల మాత్స్య పారిశ్రమిక సహకార సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యలు తదితరులు పాల్గొన్నారు.