_పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్…_
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ప్రభుత్వం పై అదనపు భారం పడుతున్నా కూడా సంపన్నులు తినే సన్న బియ్యం పేదలకు ఒకే సారి 3 నెలల బియ్యం అందజేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందుతుందన్నారు. గ్రామాల్లో అర్హులను గుర్తించాలని ఇందిరమ్మ కమిటీలను ఆదేశించిన్నట్లు తెలిపారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను తమ త్యాగాలుగా చెప్పుకుని రాష్ట్రాన్ని 10 ఏళ్లు బి ఆర్ ఎస్ పార్టీ ఏలిందన్నారు. ఎప్పటికి వాళ్ళే రాష్ట్రాన్ని ఏలాలనే ఉద్దేశం తో ఫోన్ ట్యాపింగ్ లు చేసి నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారన్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామ్మన్నారు.