*జల్సాలకు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య*
*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 26 ప్రశ్న ఆయుధం*
కాయకష్టం చేసి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎండనక వాననక కష్టపడి సంపాదించిన డబ్బులతో ఉన్నత చదువులు చదివించడానికి సిటీకి పంపిస్తే జల్సా లకు అలవాటు పడిన యువకులు ఆర్థిక ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ అఖిలేష్ తండ్రి గుత్తికొండ రాజయ్య 22yr పద్మశాలి కులానికి చెందిన బీటెక్ చదువుతున్న యువకుడు గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడని తమ కొడుకు కాలేజ్ కి సరిగా వెళ్లకుండా జల్సాలకు అలవాటుపడి గతం లో తన స్నేహితుల దగ్గర ఇష్టం వచ్చినట్లు డబ్బులు తీసుకున్నాడని అవి తన తల్లితండ్రులే తీర్చినారని కాగా మళ్లీ వారి మాట వినకుండా అలాగే స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకోవడం లోన్ ఆప్స్ లో కూడా డబ్బులు తీసుకోవడం వల్లనే అనే అనుమానం ,అవి తీర్చడానికి మార్గం లేక వారిని డబ్బులు అడగలేక తీవ్ర ఒత్తిడి కి గురై గురువారం ఉదయం 4:00 గంటలకి ఇంట్లోని దూలానికి చీరతో ఉరివేసుకొని మరణించినాడని తన తండ్రి గుత్తికొండ రాజయ్య తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ ఎస్సై దీపక్ కుమార్ పోలీస్ సిబ్బందితో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు