యువత సన్మార్గంలో నడవాలి

యువత సన్మార్గంలో నడవాలి

– ఆర్టిఐ బిబిపేట మండల అధ్యక్షులు నాంపల్లి

కామారెడ్డి యువత సన్మార్గంలో నడవాలనీ, సమాజ భవిష్యత్తు యువత పైనే ఆధారపడి ఉందని సమాచార హక్కు పరిరక్షణ కమిటీ,బీబీపేట మండల అధ్యక్షులు, సమాజ సేవ జాతీయ అవార్డు గ్రహీత, ఎం. నాంపల్లి యువతకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బివిపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, దురాలవాట్లవైపు మొగ్గుచూపవద్దని, సన్మార్గంలో నడవాలని అన్నారు. త్వరలోనే మండల కేంద్రంతో పాటు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో, సైబర్ క్రైమ్ నేరాల పట్ల, చెడు వ్యసనాల పట్ల, ఆర్టిఐ చట్టం పట్ల, మూఢనమ్మకాల పట్ల, విద్యాహక్కు చట్టం పైన, భారత రాజ్యాంగం కల్పించినటువంటి, ( చట్టాలు బాధ్యతలు )వంటి అంశాల పైన, అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొని తమ జీవితాలను బంగారు బాటలో నడిచే విధంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు, ప్రజలు చట్టాలను చేతిలోకి తీసుకోవద్దని, రాజ్యాంగ పరిధిలోనే ప్రతి ఒక్కరం జీవించాలని, ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించి తీరాలని, ఇలా జరిగిన రోజే సమాజం సన్మార్గంలో నడుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇట్టి అవగాహన కార్యక్రమాలకు ఆర్టిఐ రాష్ట్ర కమిషనర్లను ఆహ్వానిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment