రాబోయే తరాల భవిష్యత్తు అంధ కారం కాకుండా ఉండాలంటే రేపటి భావిపరులైన పిల్లలను సన్మార్గంలో నడిపించవలసిన ప్రధాన బాధ్యత తల్లి తండ్రులదే..సామాజిక మార్గదర్శకులు వారే నేటి మన సమాజంలో పాశ్చాత్య ధోరణి
………. నైతికతే నిజమైన స్వేచ్ఛ అంశంపై జమాతే ఇస్లామి హింద్ మహిళ విభాగం ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు . ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇస్లామీ హిందూ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇషరత్ బాను మాట్లాడుతూ మనదేశంలో పాశ్చాత్య సంస్కృతి వేగంగా ప్రబలిపోతున్న క్రమంలో మన విలువలు కూడా అంతే వేగంగా దిగజారి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు . పిల్లలు అల్లా అమానత్ , వారిని సరైన దారిలో నడిపించాల్సింది ఆ పిల్లల తల్లిదండ్రులే అన్నారు . తల్లి పాదాల కిందనే స్వర్గం ఉందని చెప్పిన ఇస్లాం గురించి విష ప్రచారం జరుగుతుందని , ఓవైపు మధ్యాపానం , వ్యభిచారం మరోవైపు అమ్మాయిలు జన్మిస్తే వారిని ఆ వెంటనే సజీవంగా పూడిచి వేసే అనాగరిక సమాజంలో నైతిక విలువలు పునాది మీద పుట్టిన దే ఇస్లామన్నారు . ఏదైనా విషయం పిల్లలకు సులువుగా అర్థం కావాలంటే మెల్లమెల్లగా వారికి ఆ విషయాన్ని బోధించాలని , ఇస్లాం తొలిదశలో మద్యపానం పై వెంటనే నిషేధం ప్రకటించక మద్యం సేవిస్తే నమాజు ఆచరించకూడదని వివరిస్తూ పూర్తిగా ఆ తర్వాత మద్యపానాన్ని నిషేధించిన విషయాన్ని ప్రస్తావించారు . ఇంతకుముందు ప్రసంగించిన వక్తలు ఈ విషయాన్ని చెప్పిన అంశాన్ని గుర్తుచేస్తూ మనమంతా ఈ విషయంలో సంఘటితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు . జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం స్టేట్ డైరెక్టర్ బుష్రా రెహమాన్ మాట్లాడుతూ నైతిక విలువల పెంపుదల విషయంలో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహితులు గా అన్ని విషయాలలో మార్గదర్శకత్వం వహించాలని సూచించారు . టెక్నాలజీ , సామాజిక మాధ్యమాల విష ప్రభావం వారిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు . జమాతే ఇస్లామీహింద్ మహిళా విభాగం స్టేట్ డైరెక్టర్ గజాల ఆతహర్ మాట్లాడుతూ దివ్య గ్రంథం ఖురాన్ లో అల్లా మానవులకు ఎలా జీవించాలి అనే విషయంపై స్వేచ్ఛ ఇచ్చాడని , ఆ స్వేచ్ఛ మరొకరి స్వేచ్ఛను హరించ కుండా చూసుకోవాలన్నారు . నేటి సామాజిక రుగ్మతలకు ప్రధాన కారణం గ్రహించిన తల్లిదండ్రులు వాటి ప్రభావం తమ పిల్లలపై పడకుండా నిజమైన స్వచ్ఛ నైతిక తో కూడిన దనే విషయాన్ని వివరించాలన్నారు . ఇంద్రనగర్ జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షురాలు హుస్సేన్ బి తెలుగులో ప్రసంగిస్తూ నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే విషయాన్ని అనేక ఉదాహరణలతో వివరిస్తూ నైతిక విలువలు పడిపోతే మొత్తం సమాజం భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ పిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో తమ పిల్లల కు మార్గదర్శకత్వం వహించాలని పిలుపునిచ్చారు . తొలుత ఖురాన్ పఠనం తో బహిరంగ సభ ప్రారంభమైంది . సభ అనంతరం నైతి కతే నిజమైన స్వేచ్ఛ అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలైన వారికి షీల్డ్స్ , సర్టిఫికెట్ లను ప్రధానం చేశారు . అధ్యక్షత వహించిన జమాత్ ఇస్లాం హింద్ ఖమ్మం జిల్లా జిల్లా మహిళా అధ్యక్షురాలు అస్మా అన్జుమ్ మహిళా శాఖ ఖిల్లా , ఇంద్రనగర్ , ఇస్లాంపేట అధ్యక్షురాల్లు అస్ఫీయ అన్జుమ్ , హుస్సేన్ బీ , ఖాసిమ షాహిన్ , సమీనా , నుసరత్ , హాజీర సదఫ్ , నస్రీన్ నాజియా తబస్సు , ఫర్జానా , నసీమా , జహీరా నూర్జహాన్ ఆరిఫా , ఫాతిమా తదితరులు పాల్గొన్నారు .