కొనుగోలు కేంద్రంలో వారి ధాన్యం విక్రయించాలి

*కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం విక్రయించాలి*

*దళారులకు వరి ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దు* 

*తాలు పేరుతో తరుగు పేరుతో కోతలు విధిస్తే చర్యలు తీసుకోబడతాయి*

*జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం*

 

కరీంనగర్ అక్టోబర్ 16 (ప్రశ్న ఆయుధం)

 

రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.బుధవారం జిల్లాలోని రామడుగు మండలంలోని వెదిర గ్రామ రైతువేదిక వద్ద గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి, టిసెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు 2320, బి గ్రేడ్ ధాన్యానికి 2300 అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ పంటను దళారులకు విక్రయించి నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల లోనే విక్రయించాలన్నారు రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు కొనుగోలుదారులు తాలు పేరుతో తరుగు పేరుతో కోతలు విధించినట్లయితే కొనుగోలు దారులపై తగిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కొనుగోలు కేంద్ర సిబ్బందికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, డీఆర్డీఓ శ్రీధర్ ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now