బీసీలకు ఈ డబ్ల్యూస్ రిజర్వేషన్ తో అన్యాయం

అన్యాయం

బీసీలకు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తో అన్యాయం

జీవో నెంబర్ 29 రద్దు చేయాలి

బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్

హుజురాబాద్ అక్టోబర్ 22 ప్రశ్న ఆయుధం

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లతో అడుగడుగున బీసీలకు అన్యాయాలు జరుగుతున్నాయని, అగ్రకులాల జనాబే లెక్కలు లేనప్పుడు అగ్రకులాల్లో ఉన్న పేదలను ఏ విధంగా గుర్తిస్తారని ఐదు శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కట్టబట్టడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణలో జరుగుతున్న ప్రతి రిక్రూట్మెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలని రాష్ట్రంలో అన్యాయంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 29 రద్దు చేయాలని గ్రూప్ వన్ నియామకాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని బీసీలు మునుపటిలా లేరని సంపూర్ణ చైతన్యంతో ఐక్యమత్యంతో పోరాటాలు చేస్తామని బీసీలకు అన్యాయాలు జరుగుతే ఉపేక్షించేది లేదని అన్నారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుమ్మక్కై బీసీలకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు, వెంటనే ఆ చర్యలు మానుకోవాలని కోరారు. బీసీలు సంఘటితశక్తిగా పోరాటం చేయాలని పిలిపనిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిసి ఆజాది యూత్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, నాయకులు పంజాల రేవంత్, కూరపాటి రామచంద్రం, సాగర్, రుతిక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now