Site icon PRASHNA AYUDHAM

మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి 

IMG 20250630 WA0410

మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి

 

– టిడబ్ల్యూజెఎఫ్ కామారెడ్డి జిల్లా శాఖ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 30

 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శనివారo నా మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలనీ కోరుతూ సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు మునిసిపల్ కార్యాలయం ముందుగల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ కృష్ణమాచారి లు మాట్లాడుతూ దేశంలో చాలా రాష్ట్రాలలో ఏదో ఒకచోట ప్రతి రోజు జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టుల రక్షణకై ప్రత్యేక చట్టాలను రూపొందించి అమలు చేయాలన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారు రాజకీయ నాయకులైనా ? మరి ఇంకెవరైనా ?. ఉపేక్షించక వారిని గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్ర ప్రభుత్వo పార్లమెంటులో చర్చించి జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో గాని దేశంలో గాని పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కృషి చేయాలని, లేనిచో టిడబ్ల్యూజెఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణమూర్తి, డి, మోహన్, ఉపాధ్యక్షులు జమాల్పూర్ లక్ష్మణ్, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ దశరథ్, బంగారి, శివకుమార్, శ్రీకాంత్, భాస్కర్, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version