వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ గారు కోరారు .
రైతులు , వినియోగదారులు సొంతంగా విద్యుత్ కు సంబంధించిన పనులు ఎట్టి పరిస్థితిల్లో చేయకూడదని వివరించారు . కంటికి కనపడని విద్యుత్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు . ప్రతి వైర్లలో కరెంట్ ప్రసారం అవుతుందన్న అవగాహనతో మెలగాలని అన్నారు .
తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా మరియు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు, ప్రమాదకరంగా ఉన్నటువంటివి గమనించిన వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి TGNPDCL టోల్ ఫ్రీ నo.1912 ద్వారా తెలియచేయగలరు.
ఇండ్లలో బట్టలు ఆరవేసే జి.ఐ దండెము/ వైర్ల వలన విద్యుత్ వైర్ల లో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం వలన దండెములకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్ గురయ్యే ప్రమాదం ఉందని, కనుక ప్లాస్టిక్ దండెములను ఉపయోగించాలని , తద్వారా విద్యుత్ ప్రసారం కాకుండా విద్యుత్ ప్రమాదాలను నియంత్రించవచన్నారు.
అలాగే ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉందని వివరించారు. కనుక స్థంభం నుండి విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెంలకు, రేకులకు తగలకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.
పశువుల యాజమానులు మేతకు తీసుకువెళ్ళినప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు , స్థంబాలు దగ్గరికి వెళ్లకుండా కాపరి వాళ్ళు జాగ్రత్త వహించాలని కోరారు . ఒక వేళా కరెంట్ వైర్లు కింద పడి ఉంటె కాపరి వాళ్ళు గమనించి పశువులను వాటిని తాకకుండా అప్రమత్తం చేయాలనీ కోరుతున్నామన్నారు .
ఇంటి వైరింగ్ కు సరైన ఎర్తింగ్ చేయండి మరియు నాణ్యమైన ప్లగ్గులు , సెల్ ఫోన్ చార్జర్లను ఉపయోగించండి. వ్యవసాయ మోటార్లకు , గృహాలలో నాణ్యత గల, అతుకులు (joints ) లేని సర్వీసు వైరును మాత్రమే ఉప యోగించండి.
సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి తడి చేతులతో తాకి మాట్లాడం వలన షాక్ కు గురై చనిపోతున్నారు. దయచేసి చార్జింగ్ బంద్ చేసి మాట్లాడవలసిందిగా వినియోగదారులను కోరడమైనది.
ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ కు గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు. షాక్ కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని (కర్ర, ప్లాస్టిక్ లాంటి) వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం.
ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం నాణ్యతలేని వ్యవసాయ పంపు సెట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున, కరెంటు మోటార్లను కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమరపాటుతో తాకకూడదు. వ్యవ సాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్లు తాకడం అత్యంత ప్రమాదకరం. ఎర్తింగ్ అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు .
రైతులు, వినియోగదారులు కరెంట్ పనులను సొంతంగా చేసుకొకూడదని , అర్హత కలిగిన ఎలెక్ట్రిషియన్ తో పనులు చేసుకోగలని విజ్ఞప్తి చేస్తున్నారు.
విద్యుత్ కంచె ల వలన రైతులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి . కావున రైతులు అప్రమతంగా ఉండాలని , ఎవరైనా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని కోరుతున్నాము .
విద్యుత్ కంచె ఏర్పాటు చేయడం చట్ట రీత్యా నేరం అని ఆయా రైతులకు తెలుపగలరు.
రైతులు ట్రాన్స్ ఫార్మర్ల వద్ద అధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం మరియు కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లో చేయకూదని విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని కోరారు .
గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బంది లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇంజనీర్ , సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను పొందండి.
ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన Tఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు సంప్రదించాలని కోరారు.