Site icon PRASHNA AYUDHAM

లైసెన్సు లేకుండా పత్తి విత్తనాలు మరియు నిషేధిత గడ్డి( గైసిల్ )మందు అమ్మే వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న పరిస్థితి!!!

IMG 20250628 WA0008

లైసెన్సు లేకుండా పత్తి విత్తనాలు మరియు నిషేధిత గడ్డి( గైసిల్ )మందు అమ్మే వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న పరిస్థితి!!!

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 28 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తమహేశ్వరరావు

ఈ విధంగా మోసం రైతులకు జరుగుతుంటే జిల్లాస్థాయి మండల స్థాయి సచివాలయం యొక్క వ్యవసాయ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం చాలా అన్యాయం ???

ఇటికైనా వెంటనే కొమరాడ మండలంలో లైసెన్స్ లేకుండా గడ్డి మందు మరియు వివిధ రకాల పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి అధికారులకి విన్నపం

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు అనగా శుక్రవారం పత్రిక విలేకరుల సమావేశం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘము నాయకులు రామారావు వెంకటేష్ పత్రిక విలేకరులతో మాట్లాడుతూ కొమరాడ మండలంలో ఎక్కువమంది వ్యాపారులు పత్తి విత్తనాలు నాటే సమయం రావడంతో జోరుగా పత్తి విత్తనాలు మరియు మన రాష్ట్రంలో నిషేధించిన గడ్డి మందు కొమరాడ మండలంలో అటు ఒరిస్సాలో ఎక్కడ బడితే అక్కడ విడి విడిగా దొరుకుతున్న గడ్డి మందు నుండి తెచ్చి మధ్య దళారులు అధిక రేటుకి అమ్మే పరిస్థితి ఉందని ఈ గడ్డి మందు మన ఆంధ్రాలో నిషేధం ఒరిస్సాలో అమ్ముకునే పరిస్థితి ఉండడంతో ముఖ్యంగా నాగావళి నది అవతల గ్రామాలలో కొంతమంది రైతులు దళారులు లైసెన్స్ లేకుండా మరియు వీరఘట్టం పాలకొండ నుండి కూడా మధ్య దళారులు వచ్చి పత్తి పండించే రైతులకి పత్తి విత్తనాలు మరియు గడ్డి మందు అధిక రేటు తో పాటు అరువు కూడా ఇచ్చే పరిస్థితి లో భాగంగా ఇష్టం వచ్చినట్లుగా మ్యానుఫ్యాక్చర్ డేట్ అయిపోయిన విత్తనాలు కూడా అటు ఒరిస్సా నుండి ఇష్టం వచ్చినట్లుగా తెచ్చి పత్తి పండించే రైతులకు అమ్మే పరిస్థితి ఉందని ఇలాంటి సమయంలో కాలం చెల్లిన పత్తి విత్తనాలు కూడా కొత్త కొత్త కవర్లో వేసి మ్యానుఫ్యాక్చర్ చేసి రైతులకు అమ్మే పరిస్థితి ఉందని దీనివల్ల రైతులు దిగుబడి లేక అధిక మోతాదులు చాలా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుందని ఇలాంటి సందర్భంలో ఈ విధంగా జరుగుతుంటే వ్యవసాయ శాఖ ఏడీ గారు గాని సచివాలయంలో పనిచేయుచున్న అగ్రికల్చర్ అధికారులు గానీ మండల వ్యవసాయ శాఖ అధికారి గాని పూర్తి స్థాయిలో గ్రామాల్లో పర్యవేక్షణ లేకపోవడం అసలుకు ఏడి గారు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిల్లో పత్తి విత్తనాలు మరియు గడ్డి మందు వి చ్చలవిడిగా ప్రతిరోజు అమ్ముకునే రైతులకు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండే పరిస్థితి ఉంటది కాబట్టి వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా కొమరాడ మరియు గరుగుబిల్లి మరియు జియ్యమ్మ వలస లైసెన్స్ లేని షాపులు చాలా వరకు ఉన్నాయి ఈ మండలాల్లో తనిఖీలు చేయండి మండలంలో నాగావళి నది అవతల ప్రాంతంలో మరియు గిరిజన మరియు మైదాన ప్రాంతాల్లో జోరుగా పత్తి విత్తనాలు గడ్డి మందు లైసెన్స్ లేకుండా అమ్మే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సాధించి ఎవరైతే పత్తి విత్తనాలు మరియు గడ్డి మందు లైసెన్స్ లేకుండా అమ్ముతున్నా రో వారిపై కఠినమైన చర్యలు తీసుకొని లైసెన్స్ కలిగి డీలర్ ద్వారా మంచి మరియు దిగుబడి వచ్చే పత్తి విత్తనాలు అమ్ముతున్న డీలర్ల ద్వారా రైతులు కొనుగోలు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారులకు విన్నవించుకుంటున్నాము లేని యెడల భవిష్యత్తులో లైసెన్స్ లేకుండా పత్తి విత్తనాలు మరియు నిషేధిత గట్టిమందు అమ్మే మధ్య దళారులు పైన పత్తి విత్తనాలు అమ్ముతున్న రైతులు పైన కూడా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా త్వరలో ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయుచున్నాము

ఈ కార్యక్రమంలో గిరిజన సంఘము నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు

కొమరాడ మండల కేంద్రంలో పత్రిక విలేకరులతో మాట్లాడుతున్న నాయకులు ఫోటో వీడియో రైతులు వేసిన పత్తి మొక్కను పరిశీలిస్తున్న ఫోటో చూడగలరు

Exit mobile version