Site icon PRASHNA AYUDHAM

మరో మూడు రోజులు వానలు..

ఏపీకి తుఫాను ముప్పు.. మరో మూడు రోజులు వానలు

ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని సమాచారం. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Exit mobile version