వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న పులి మామిడి రాజు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట పట్టణంలో నిర్వహించిన సామూహిక గణేష్ నిమజ్జన మహోత్సవంలో వినాయకునికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజు పూజలు నిర్వహించారు. ప్రతి వినాయక వాహనానికి మున్సిపల్ సిబ్బంది పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్వాగతం పలకారు. ఈ కార్యక్రమంలో పులిమామిడి రాజు పాల్గొని ప్రతి ఒక్క వినాయకునికి వినాయకుని ప్రతిమ గల ఫొటోస్ ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ కమీషనర్ ఉమా, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, పట్టణ సీఐ మహేష్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, గుండు రవి, సాతాని శ్రీశైలం, శంకర్ గౌడ్, పిచ్చారాగడి శివ, అరుణ్, ఇంద్రమోహన్ గౌడ్, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పవన్, రవీంద్రనాథ్, రమేష్, శాంతు కుమార్, గంట శివన్న, కనిగిరి శంకర్, తుమ్మలపల్లి పృథ్వీరాజ్, కంది కృష్ణ , మునుపల్లి సత్యనారాయణ, కొవ్వూరి సంగమేశ్వర్, తోట చంద్రశేఖర్, మాణిక్ రావు, శ్రీశైలం యాదవ్, కనిగిరి కృష్ణ మరియు పీ.ఎం.ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now