ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఆపరేటర్ల ఆధ్వర్యంలో
డైరెక్టర్ “పా” మరియు ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జీ వెంకటేశ్వర రెడ్డి కి, ఏరియా జిఎం దుర్గం రామచందర్ కి ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేత
సింగరేణి వ్యాప్తంగా ఈపీ ఆపరేటర్ల కు టైం బాండ్ ప్రమోషన్ పాలసీ అమలు అమలు చేయాలని కోరుతూ
ఈపి ఆపరేటర్ల ఆధ్వర్యంలో బుధవారం నాడు మణుగూరు పర్యటనకు విచ్చేసిన డైరెక్టర్ “పా” మరియు డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జీ వెంకటేశ్వర రెడ్డి కి, ఏరియా జిఎం దుర్గం రామచందర్ గారికి ఇల్లందు గెస్ట్ హౌస్ లో మరియు ఓసి 2 లో అడిషనల్ మేనేజర్ కళ్యాణ్ రామ్ గారికి ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు ఈపి ఆపరేటర్స్ నాయకులు యస్ డి నా సర్ పాషా విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా వివిధ ఓసి గనులలో పనిచేస్తున్న ఈపి ఆపరేటర్లకు సంబంధించి ఎక్స్ కా వేషన్ క్యాటగిరి “డి” గ్రేడ్ లో రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఆపరేటర్లకు గతంలో నామమాత్రపు అర్హత పరీక్షలు నిర్వహించి సకాలంలో పదోన్నతులు కల్పించేవారని. కానీ గత కొంతకాలంగా వెకేషన్ లింక్డ్ ప్రమోషన్ పాలసీ పేరుపై “ఐ ఈ డి” విభాగం గారు పునః పరిశీలన (రివైజింగ్) నిర్వహించిన తర్వాత “ఏ”గ్రేడ్ “బి”గ్రేడ్ ఖాళీలు భర్తీ చేసి తర్వాత “సి” గ్రేడ్ ఖాళీలు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారని. దీంతో కొన్ని ఏరియాలలో ఆపరేటర్లు దీర్ఘకాలికంగా ప్రమోషన్ గ్రేడ్ సర్వీస్ కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు , కొన్ని సమయాలలో ప్రమోషన్ ఆర్డర్ లో బ్యాక్ డేట్ ఇచ్చి కూడా నోషనల్ అని షరతు పెట్టడంతో ఏరియర్స్ కూడా కోల్పోతున్నారని. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా “డి” గ్రేడ్ పదోన్నతికి అర్హత సాధించిన ఆపరేటర్లు ఓసి గనులలో ఇప్పుడున్న భారీ యంత్రాలన్నీ మినిమం “ఏ” గ్రేడ్ మరియు కొన్ని మాత్రమే “స్పెషల్ గ్రేడ్” కు సంబంధించినవే కదా మరి మాకు ఇచ్చే ప్రమోషన్ల విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారని. అధికారులకు వినతి పత్రాలు అందజేసినా కూడా ప్రమోషన్ పాలసీ అమలులో ఎందుకింత జాప్యం అంటూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని ఆయన తెలిపారు. రేయనకా పగలనకా షిఫ్ట్ లలో బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించే ఆపరేటర్ల ప్రమోషన్స్ ఇచ్చే విషయంలో యాజమాన్యం సానుకూలంగా వ్యవహరించాలని “సి” గ్రేడ్, బి గ్రేడ్ మరియు ఏ గ్రేడ్, మరియు స్పెషల్ గ్రేడ్ పదోన్నతుల ఖాళీల భర్తీ లో జాప్యం లేకుండా చూడాలని ఆపరేటర్లను ప్రోత్సహించే విధంగా “సీ” గ్రేడ్ వెంటనే ఇచ్చే విధంగా యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తో యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశం ఏర్పాటు సందర్భంగా ఈ పి ఆపరేటర్ల ప్రధాన సమస్య టైం బాండ్ ప్రమోషన్ పాలసీ మరియు సూటబుల్ జాబ్ సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని గుర్తింపు సంఘం నాయకులను ఆపరేటర్ల తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు పాపారావు,పూనెo కాంతారావు, కె రవిశంకర్, పి హరి ప్రసాద్, బూర్గుల వేణు, ఆర్ రాకేష్ , ఎం నరేష్, ఏ శేఖర్ ఏ క్రాంతి కుమార్, ఓ అనిల్, కే మల్లేష్, పి సంతోష్ పెద్ద ఎత్తున బి రిలే ఆపరేటర్లు పాల్గొన్నారు.
సింగరేణి వ్యాప్తంగా ఈపీ ఆపరేటర్ల కు టైం బాండ్ ప్రమోషన్ పాలసీ అమలు అమలు చేయాలి
