తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మహమ్మద్ సాలార్ విజ్ఞప్తి
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి జనవరి 8
శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం లో పనిచేస్తున్న టైం స్కేల్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని, రిటైర్డ్ అయిన సిబ్బందికి 7:50 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మహమ్మద్ సాలార్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం లో రామారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహమ్మద్ సాలార్ మాట్లాడుతూ ఉద్యాన పరిశోధన స్థానంలో నిర్వహణలో కీలకపాత్ర పోషించే టైం స్కేల్ సిబ్బంది కృషి చాలా కీలకమని కానీ వీరి సమస్యలు పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు. క నీస వేతనాలు అందించడంలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, జీవో 16 ప్రకారం యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను యూనివర్సిటీలో పనిచేస్తున్న టైం స్కేల్ సిబ్బందితో భర్తీ చేయాలని, , ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని మహిళా ఉద్యోగులకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దిశలోనే టైం స్కేల్ సిబ్బంది 34 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులతో విధులను నిర్వర్తిస్తున్నారని 2/94 చట్టాన్ని సవరించి టైంస్కేల్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని, సర్వీస్ను పరిగణలో తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలపరిచి, భీమా సదుపాయం కల్పించాలని, విద్యార్హతన పరిగణన తీసుకుని పదోన్నతులు కల్పించి సముచిత న్యాయం కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థలాలు ఇప్పించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దిశలోనే నూతన కమిటీ అద్యక్శ కార్యదర్శు లు గా బమ్మిడి దుర్గా, రామారావు కోశాధికారి గా సత్యనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్,ఉమరమేష్, నాగేశ్వరరావు,రమణ,జగద, రాములు, వరలక్ష్మి, బాషా తదితరులు పాల్గొన్నారు.