జర్నలిస్టుల ఇoడ్ల స్థలాల పోరాటానికి

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలిపిన బొమ్మెర శ్రీనివాస్*

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 23 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

జర్నలిస్టులు చేస్తున్న ఇండ్ల స్థలాల పోరాటానికి మద్దతు తెలిపారు.

షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెంలో జర్నలిస్టులు చేపట్టిన ఇండ్ల స్థలాల రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపి సంఘీభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడారు.జర్నలిస్టులు నివాసం ఉండడానికి ఇంటి స్థలం ఇల్లు నిర్మించి ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.దశాబ్దాలుగా జర్నలిస్టులు ఎండనక,వాననక, రేయనక,పగులునక స్వచ్ఛందంగా సమాజ అసమాన తలను పోగొట్టడానికి పనిచేస్తూ సమాజాన్ని మేలుకొలుపుతున్న జర్నలిస్టులని వారి సమస్యలు ఇండ్ల స్థలాలతో పాటు,ఆరోగ్య రీత్యా హెల్త్ కార్డులు,వారి పిల్లలకు ఉచిత విద్య అందించే బాధ్యత ప్రభుత్వాన్ని దేనని డిమాండ్ చేశారు.ఇప్పటివరకు జర్నలిస్టులు అభద్రతతో బ్రతుకుతున్నారని వారికి భద్రతా కల్పించే బాధ్యత ప్రభుత్వాని దేనని తెలియజేశారు. సందర్భంగా చదలవాడ సూరి, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు కండే రాములు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now