Site icon PRASHNA AYUDHAM

రెండు లక్షల లోపు రైతుల రుణాలను మాఫీ చేయాలని

IMG 20241223 WA0152

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 23 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గూగులోత్ బద్రు నాయక్ , అంగోత్ నాగేష్, బానోత్ ప్రతాప్ శ్రేణులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. కొత్తగూడెం మండలం చిట్టి రామవరం తండాలో రెండు లక్షల లోపు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్న రైతుల రుణాలు మాఫీ కాలేదని వినతిపత్రం సమర్పించారు. రెండు లక్షలు దాటిన వారు ఆ పై మొత్తాన్ని బ్యాంకులో చెల్లించారని వారికి కూడా మాఫీ కాలేదన్నారు. సంబంధిత శాఖ అధికారులను సంప్రదిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని తెలిపారు. వెంటనే రైతు రుణమాఫీపై దృష్టి సారించి ప్రభుత్వ నిబంధనలకు లోబడిన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని కోరారు.

Exit mobile version