Site icon PRASHNA AYUDHAM

నేడు స్వర్ణామృత ప్రాసన వితరణ చేయనున్న వికాస తరంగిణి

IMG 20250627 WA0051

*నేడు స్వర్ణామృత ప్రాసన వితరణ చేయనున్న వికాస తరంగిణి*

*చిన్నపిల్లలు ఇమ్యూనిటీ పెంచడానికి స్వర్ణామృత*

*జమ్మికుంట జూన్ 27 ప్రశ్న ఆయుధం*

చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ఉండడానికి స్వర్ణామృత ప్రాసన ఉపయోగపడుతుందని వికాస తరంగిణి సభ్యులు తెలిపారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వెంకటాద్రి నగర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వికాస తరంగిణి వారు చిన్నపిల్లలకు స్వర్ణమృత ప్రాసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి మంగళ శాసనములతో వికాస తరంగిణి జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఉచితంగా ఆరు నెలల వయస్సు ఉన్న పిల్లల నుండి 16 సంవత్సరాల పిల్లల వరకు శనివారం ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు స్వర్ణామృత ప్రాసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలతోపాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకొని పిల్లలను దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కాపాడుకోవాలని వారు తెలిపారు ఈ సదవకాశాన్ని చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు బంధువులు వినియోగించుకోవాలని వారు సూచించారు ఏమైనా సమాచారం కొరకు ఎదులాపురం వెంకటేష్, సమ్మయ్య వారి సెల్ నెంబర్ 7893426429,9959974129 నెంబర్ లో సంప్రదించాలని తెలిపారు.

Exit mobile version