బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షకు భయపడిన నేటి రాష్ట్ర ప్రభుత్వం… తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా చేయబోతున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయవద్దని అడ్డుకోవడం జరిగింది. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను మూసివేసే వరకు నాయి పోరాటం ఆగదు…. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా నా ఈ పోరాటాన్ని మాత్రం ఆపేది లేదు. మాకు ఎవరు అండగా వచ్చినా, రాకపోయినా ఈ నా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. జై తెలంగాణ జై జై తెలంగాణపాల్దే కృపా జ్యోతి తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ ఫౌండర్..