*రేపే మౌని అమావాస్య.. ఎందుకంత విశిష్టమైనది?*
*ప్రయోగరాజ్*
ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య రానుంది. కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. ఈ దినాన మౌనదీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. ఈ సమయంలో పుణ్య స్నానమాచరిస్తే ఎన్నోజన్మల పుణ్యం లభిస్తుంది.