Headlines in Telugu
-
ట్రాఫిక్ అవగాహనకు శ్రీ చైతన్య విద్యార్థుల సేఫ్ ఇండియా కార్యక్రమం
-
నాగర్ కర్నూల్ వీధుల్లో ట్రాఫిక్ నియమాలపై ర్యాలీ
-
రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్ఐ కళ్యాణ్ యాదవ్ అవగాహన
-
స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్లో భాగంగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
-
శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు
స్థానిక నాగర్ కర్నూల్ ఈశ్వర్ కాలనీలో గల శ్రీ చైతన్య టెక్నో పాఠశాల యందు ప్రతినెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా నవంబర్ నెలలకు గాను గురువారం”సేఫ్ ఇండియా” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ ఎం. కళ్యాణ్ యాదవ్ పాల్గొని రోడ్డు భద్రత గురించి మరియు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమ అనంతరం విద్యార్థినీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి నాగర్ కర్నూల్ పట్టణ వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎ.జీ.ఎం. ఎస్. భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపల్ రాజీవ్ ప్రియదర్శన్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు.