Site icon PRASHNA AYUDHAM

గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి శిక్షణా తరగతులు

IMG 20250212 WA0228

జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి.*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 12 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి తెలిపారు. జిల్లాలో రెండవ విడత సాధారణ ఎన్నికలు సర్పంచి మరియు వార్డ్ గ్రామపంచాయతీల ఎన్నికకు సంబంధించి పోలింగ్ లో పాల్గొనే రిటర్నింగ్ అధికారులు మరియు సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు, ఎన్నికల నియామావళిని అనుసరించి మొదటి విడత శిక్షణా తరగతులు ఈ నెల 13వ తేదీ కొత్తగూడెంలోని జడ్పీహెచ్ఎస్ ఆనంద ఖని మార్వాడి క్యాంప్ నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో రిటర్నింగ్ అధికారులు మరియు సహాయ రిటర్నింగ్ అధికారులు 350 మంది మరియు ఎంవోటీలు 46 మంది శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

Exit mobile version