*తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ?*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి,అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ తాజా బదిలీల్లో పలు వురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిం చడంతో పాటు, కొన్ని కీలక విభాగాలకు అదనపు బాధ్యతలు కేటాయించారు.
*తెలిసిన వివరాల ప్రకారం…*
1)కె. సురేంద్ర మోహన్ – సహకార కమిషనర్గా నియమితులయ్యారు. అదనంగా మార్కెటింగ్ డైరెక్టర్ హోదాను కూడా చేపట్టనున్నారు.
2)ఎల్. శివకుమార్ – ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ సీఈవోగా బాధ్యతలు నిర్వహించిన శివకుమార్ ను సాధారణ పరిపాలన శాఖ లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
3)ఆర్.వి. కర్ణన్ – ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటు ఆరోగ్యశ్రీ సీఈవో హోదా కూడా కలిగిన అధికారి కానున్నారు.
4)కె. హరిత – వాణిజ్య పన్నుల డైరెక్టర్ గా బాధ్య తలు చేపట్టనున్నారు.
5)యాస్మిన్ బాషా – ప్రస్తుత బాధ్యతలకు తోడు విత్తనా భివృద్ధి సంస్థ డైరెక్టర్ హోదాను కూడా నిర్వహించనున్నారు.
6)కె. చంద్రశేఖర్ రెడ్డి – తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ ఎండీ గా అదనపు బాధ్య తలు అందుకోనున్నారు.
7)సంచిత్ గంగ్వార్ – వనపర్తి అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనను నారాయణపేట అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు.
8)బి. శ్రీనివాస్ రెడ్డి – టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని మాతృసంస్థకు తిరిగి బదిలీ చేశారు.