గిరిజన ఎమ్మెల్యే అంటే ఇంత చిన్నచూపా.. నేను లేరనుకున్నారా..

ప్రోటోకాల్ పాటించని అధికారులు, తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జారే

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి ఏప్రిల్ 29

అశ్వరావుపేట నియోజవర్గ ప్రజలు భారీ మెజారిటీతో ఎన్నుకొన్న గిరిజన ఎమ్మెల్యే అయినటువంటి జారే ఆదినారాయణ, ఫోటో కాల్ పాటించకుండా కనీసం సమాచారం అందించకుండా చిన్న చూపు చూడడంపై తీవ్రమైన ఆసహనం వ్యక్తం చేశారు. సాక్షాత్తు తుమ్మల నాగేశ్వరరావు ముందే అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడ్డ దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దిశా కమిటీ సభ్యురాలు యేసు మని, చిన్న శెట్టి యుగంధర్ రావు. మంత్రి కాన్వాయ్ ని అడ్డగించారు.ఈరోజు దమ్మపేట మండలంలో పూసుకుంట గ్రామంలో మంత్రి తుమ్మల మరియు ఎమ్మెల్యే జారే పర్యటనలలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో షెడ్యూల్లో లేని 15 కోట్ల రూపాయల విలువైన ఆర్ అండ్ బి రోడ్డును కూడా షెడ్యూల్లో పొందుపరిచారు. కానీ అధికారులు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లలేదు ఎవరి అండదండలతో ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక గిరిజన ఎమ్మెల్యే ను అధికారులు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం నచ్చని కార్యకర్తలు అభిమానులు ఆ కార్యక్రమం నుంచి బహిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే మనోభావాలు నాయకుల మనోభావాలుకార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని అధికారులు ఎలాంటి దుశ్చర్యలను వెంటనే సరి చేసుకోవాలని లేకుంటే తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. కొంతమంది వారి ఆధిపత్యాన్ని కనబరుచుకోవడం కోసం ఈ విధంగా ఎమ్మెల్యే ను సంప్రదించకుండా సొంత నిర్ణయాలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలాగే చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now