సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ నాయక్ నియామకం

సేవాలాల్
Headlines
  1. సేవాలాల్ సేన గిరిజన సంక్షేమం లక్ష్యంగా పోరాటం
  2. గిరిజన రక్షణ చట్టాలను అమలు చేయాలని సేవాలాల్ సేన అభ్యర్థన
  3. సేవాలాల్ మహారాజ్ ఆశయాలను సాధించేందుకు కృషి చేసే పిలుపు
  4. భద్రాద్రి కొత్తగూడెంలో గిరిజన సమస్యలకు సేవాలాల్ సేన పోరాటం
  5. సేవాలాల్ సేన గిరిజన హక్కుల కోసం నిలబడుతోంది
గిరిజన జాతి సంక్షేమమే సేవాలాల్ సేన లక్ష్యం

గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు పరచాలి*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణంలో ప్రతాప్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ సేన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా గుగులోత్ భద్రు నాయక్ పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సభావట్ శ్రీనివాస్ నాయక్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ గోపి రాథోడ్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా బానోత్ శ్రీనివాస్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు
గిరిజన జాతి సంక్షేమమే సేవాలాల్ సేన లక్ష్యమని అన్నారు ముఖ్యంగా గిరిజన రక్షణ చట్టాలైన 1/59,1/70, పీసా చట్టాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.ఏజెన్సీ ప్రాంతాలలో పూర్తి హక్కుల గిరిజనులకు దక్కేలా ప్రభుత్వాలు చట్టాలను రూపొందించాలని అన్నారు ప్రతి గిరిజన బిడ్డ సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధన కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సేవాలాల్ సేన నిరంతరం పోరాటం చేస్తుందని
అన్నారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు ఆంగోత్ నగేష్ నాయక్ జిల్లా నాయకులు ప్రతాప్ నాయక్,శ్రీకాంత్ నాయక్,బానోత్ వీరేందర్ కుమార్,నునవత్ రాజా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now