అమెరికాలో ట్రంప్ గెలుపు ఫాసిస్టు శక్తుల గెలుపు

లగచర్ల తదితర గ్రామాలపై దాడులు ఆపాలి   ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ప్రజలకు ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేయాలి- సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తాను ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా తాత్సారం చేయడం సరికాదని, వెంటనే యిచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని సీపీఐ (ఎం-ఎల్) మాన్లైన్ ( ప్రజాపంథా) డిమాండ్ చేసింది. సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఖమ్మంలో నవంబర్ 14,15,16 తేదీలలో జరిగింది. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలను పలు సమస్యలను చర్చించింది. భవిష్యత్తు కార్యక్రమాలను తీసుకున్నది.
వికారాబాద్ జిల్లా లగచర్ల తదితర గ్రామాలపై పోలీసుల దాడులు ఆపాలి. అక్రమ అరెస్టులు ఆపాలి. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. రైతులు తమ భూముల రక్షణ కోసం చేసిన పోరాటాన్ని సీపీఐ (ఎం-ఎల్) మాన్లైన్ బలపరుస్తున్నది. భూములు కోల్పోతున్న రైతుల అభీష్టం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. బలవంతంగా భూములు తీసుకోవద్దు. ఫార్మ కంపెనీల ప్రయోజనాలకు అనుకుణంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయం. సీపీఐ (ఎం-ఎల్) మాస్లైన్ రాష్ట్ర ప్రతినిధి బృందం లగచర్ల సందర్శిస్తుంది. రైతులకు మద్దతు యిస్తుంది.
పత్తి రైతుల పంటను తేమతో సంబంధం లేకుండా సీసీఐ అన్ని సెంటర్లు కొనుగోలు చేయాలి. సీసీఐ నత్తనడకను కొనగోలు చేయడం, ఖరీదు దార్లతో కుమ్మక్కయి రైతుల పంటలను నిరాకరిస్తున్నారు. కానీ వ్యాపారస్థుల పంటలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెటులో ధరలు తగ్గించి కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే రైతుల పంటను కొనుగోలు చేయాలి. అలానే దాన్యం కొనుగోళ్లు కూడా వెంటనే చేయాలి. అన్ని రకాల దాన్యానికి ప్రభుత్వం బోనస్ యివ్వాలి.సీపీఐ(ఎం-ఎల్) మాన్లైన్, అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ( ఎఐపికెఎస్) ప్రతినిధి బృందాలు మార్కెట్లను సందర్శించి అక్కడి సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తారు.
ఉచిత గ్యాస్, కరెంట్ వినియోగాదారులకు అందరికి అందితీరాలి. చాలమంది టెక్నికల్ కారణాలతో నిరాకరిస్తున్నారు. దీనిపై స్థానికంగా ప్రచారం చేసి ఆందోళనలు నిర్వహించాలని రాష్ట్రకమిటీ అభిప్రాయపడింది.
స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం యిచ్చి, బస్సులనురూ,,3వేలు తగ్గించారు. దీనితో ప్రయాణికులు అరిగోస పడుతున్నారు. స్టాప్లో ఆగక, లోపల జాగలేక ఎన్నో యిబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులకు సరిపడా ఐస్సులనపు వేయాలని, స్త్రీలకు ఉచితం యిచ్చి, వారిని అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదు.దీనిపై డిసెంబర్ 4వ తేదీనప డిపోలముందు, హైదరాబాద్లో ఐస్భవన్ ముందు ధర్నాలు చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.పాలస్తీనాపైస అమెరికా అందతో ఇజ్రాయిల్ చేస్తున్న మరణహామాన్ని ఆపాలని పార్టీ ఖండించింది. జాతి నిర్మూలన యుద్ధం, ఇది ఏకపక్ష యుద్ధం. దీనిని ఆపాలి.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజకీయ రిపోర్టు యిస్తూ అమెరికాలో ట్రంప్ గెలుపు ఫాసిస్టు శక్తుల గెలుపుగా అభివర్ణించారు. గ్రేట్ అమెరికా పేరుతో, అమెరికా సేవ్ పేరుతో నినాదాలు ఇస్తున్న ట్రంప్ అమెరికా ప్రయోజనాల కోసం ఆర్థిక వర్ధమానప దేశాల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నారు. యిప్పటికే ప్రపంచం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో వున్నది. అమెరికా సంక్షోంభంలో వున్నదని, దాని నుంచి బయట పడటానికి వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ యుద్ధాలను సృష్టిస్తున్నదని అన్నారు. తను ఆయుధాలను పెద్ద ఎత్తున అమ్ముకుంటున్నదని అన్నారు. పశ్చిమాసియా ఇజ్రాయెలకు అన్ని రకాల అండదదలిచ్చి అమెరికా, నాటో కూటమి దురాక్రమణ శక్తిగా మార్చారని ఆరోపించారు. అంతర్జాతీయ న్యాయస్థానాలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఇజ్రాయెల్ ఖతారు చేయడం లేదని అన్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధానికి వారు కూడా కారణమాని వివరించారు.దేశంలో మోదీ ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టడమే ఒక విధానంగా పెట్టుకుందని, విద్వేష ఉన్మాద విధానలను అనుసరిస్తుందని అన్నారు. మహారాష్ట్ర, హార్యాణ, జార్ఖండ్ ఉపఎన్నికలలో తన స్థాయిని విడిచి ప్రసంగిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతుందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో ఆదివాసీ ప్రజల నిర్మూలనకు పూనుకుంటుందని విమర్శించారు. వేలదిమంది సైన్యాన్ని దింపి, కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తుందని విమర్శించారు. బూటకపు ఎన్ కౌంటర్లు పెద్ద ఎత్తున చేస్తుందన్నారు.రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయగపోగా, హైడా పేరుతో, ఫార్మకంపెనీ కోసం భూసేకరణ పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నరని అన్నారు. రాష్ట్రులోని ప్రజల సమస్యలను దృష్టి మళ్ళీంచడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ క్రీడ సడుపుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య మటాల యద్ధం ప్రజల కోసం కాదని, వారి అధికార ప్రయోజనాల కోసం చేస్తుందని అన్నారు.ఈ విలేఖరుల సమావేశంలో కె.జి. రామచందర్, కె. రమ, కెచ్చెల రంగయ్య, గోళేనపల్లి వెంకటేశ్వరరావు, చిన్నచంద్రన్న, గుమ్మడి నర్సయ్య, వి. కృష్ణ వి. ప్రభాకర్, సదానందం, కె. సూర్యం, ఎం. కృష్ణ,అరుణ,కృష్ణారెడ్డి, గుర్రం అచ్చయ్య ఆవుల వెంకటేశ్వర్లు ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now