Site icon PRASHNA AYUDHAM

విప్లవ కార్మిక వర్గ పోరాటాల బలోపేతం కోసమే టియుసిఐ మహాసభలు

IMG 20250618 WA0009

విప్లవ కార్మిక వర్గ పోరాటాల బలోపేతం కోసమే టియుసిఐ మహాసభలు

– టియుసిఐ జిల్లా సభలు జయప్రదం చేయలి

– సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కామారెడ్డి జిల్లా నాయకులు. బి. కిషోర్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

విప్లవ కార్మిక వర్గ పోరాటాల బలోపేతం కోసమే సిరికొండలో టియుసిఐ మహాసభలు అని, సిరికొండలో జరిగే టియుసిఐ జిల్లా సభలను జయప్రదం చేయాలని

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కామారెడ్డి జిల్లా నాయకులు బి. కిషోర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్యలను తీసుకుంటుందన్నారు. ప్రధాని మోడీ సంపన్నులకే సర్వం దోచిపెడుతున్నారన్నారు. శ్రమజీవులైన కార్మిక వర్గాన్ని పూర్తిగా అన్యాయం చేస్తూ రోడ్డుమీదికి నేడుతున్నారన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించకున్న కార్మిక చట్టాలను ఒక్క కలంపుటితో రద్దుచేసి కార్మికుల పొట్ట కొట్టాడు అన్నారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను సాధుపించుకునేందుకు అవకాశం లేకుండా చేసే కుట్రకు పూనుకొన్నాడన్నారు. కార్మికుల సంక్షేమం మరిచి కేవలం కోటీశ్వరులకి సర్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషమ పరిస్థితులలో కార్మిక వర్గం ఐక్యం కావలసిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే కార్మిక వర్గ ఐక్యత కోసం టి యు సి ఐ పనిచేస్తుందన్నారు. సిరికొండలో జరిగే జిల్లా మహాసభల్లో చేపట్టిన కార్మిక పోరాటాలు సమీక్షించుకొని చేపట్టబోయే భవిష్యత్తు కార్మిక పోరాటాలను రూపొందించుకొని కొత్త కార్యవర్గం ఎంచు కోని నూతన ఉత్సహాముతో టియుసిఐ బలోపేతంకు కృషి చేస్తుందన్నారు. బలమైన ఐక్య విప్లవ పోరాటాలే కార్మికుల బ్రతుకుల్లో వెలుగు నింపగలుగుతుంది అన్నారు. టియుసిఐ జిల్లా మహాసభలు విజయవంతం కోసం కార్మికులు, కర్శకులు,విద్యార్థు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ

కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్. కామారెడ్డి జిల్లా నాయకులు యస్. కిషోర్, సురేష్, ప్రకాష్ మండల నాయకులు గోపాల్, రాజు, వెంకన్న. మురళీ,. సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version