: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 13 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ భద్రాచలం అనుబంధ ఆలయం అయిన పర్ణశాల ఆలయమును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణం మొత్తం ఔషధ మొక్కలు అయిన తులసి మొక్కలను విరివిగా నాటాలని, అందుకోసం దేవస్థానం వారు సూచించిన ప్రదేశమును పరిశీలించారు. స్థానిక పంచాయతీ అధికారుల సహకారంతో తులసి మొక్కలను వేయాలని, పర్ణశాల ఆలయం ప్రక్కన గల దారి మొత్తం షాపులతో క్రిక్కిరిసినందున ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పర్ణశాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తగు విధమైన ప్రణాళికను తయారు చేయవలసినదిగా, ఆలయ రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా షాపులను వేరొక చోటకు మార్చు విధంగా సరైన ప్రణాళికలు సిద్ధం చేయవలసినదిగా పంచాయతీ మరియు దేవస్థానం అధికారులకు ఆదేశించారు. ఆలయం ఎదుట విప్ప పువ్వులు అమ్ముకునే వారి వద్ద ఆగి వారి నుండి వివరాలు తెలుసుకొని కొంత విప్ప పువ్వు కొనుగోలు చేసారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటుగా భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి , దేవస్థాన ఈ ఈ , పంచాయతీ సెక్రెటరీ పర్ణశాల ఆలయ ఇన్చార్జి తదితరులు పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలో విస్తృతంగా తులసి మొక్కలు నాటాలి
by Naddi Sai
Published On: February 13, 2025 7:23 pm
