Site icon PRASHNA AYUDHAM

గంజాయి కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

IMG 20250619 WA1502

*గంజాయి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..*

*జనగామ జిల్లా:*

*దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్ లో ఎస్పై సృజన్ కుమార్ తో కలిసి సిఐ జానకిరామ్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.* బుధవారం ఉదయం దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలో గల ధరావత్ తండా నుండి ధర్మగడ్డ తండాకు ఉదయం 9:30 సమయంలో ఎస్సై సృజన్ కుమార్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ధర్మగడ్డ తండా వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని చూసి ఎందుకు భయపడుతున్నావని ప్రశ్నించి,వారి చేతిలో ఉన్న కవర్ లో ఏముంది అని అడుగగా వారు తడబడుతూ, భయపడుతూ వారి వద్ద గంజాయి ఉన్నదని తెలుపగా వెంటనే ఎస్పై వారిని అదుపులోకి తీసుకొని వారి యొక్క వివరాలు అడుగగా భూక్యా నరేశ్,చౌడబోయిన సురేష్ వీరు ధర్మగడ్డ తండాకు చెందిన వారని చెప్పగా వారిని విచారించగా భూక్యా నరేశ్ హైదరాబాద్ లో పని చేసేటప్పుడు అతని స్నేహితుల ద్వారా సిగిరెట్ తాగడం అలవాటు అయిందనీ వారితో పాటు దుల్ పేటకు వెళ్ళి గంజాయ్ తాగడం కూడా అలవాటు అయిందనీ స్వంత ఊరికి వచ్చిన్నపుడు స్నేహితుడు అయిన చౌడబోయిన సురేష్ కు కూడా గంజాయ్ ఇవ్వడంతో ఇద్దరు కలిసి గంజాయి తాగుతుండే వాళ్ళమని చెప్పారని,వారి వద్ద నుండి రెండు చిన్న పాకెట్ల గంజాయిని రూ.2 వేల విలువ గల వాటిని స్వాదినం చేసుకొని వారి వద్ద వున్న రెండు ప్లాస్టిక్ కవర్ తెరచి చూడగా అందులో రెండు ప్లాస్టిక్ జిప్ కవర్లు ఉన్నాయని,వాటిని తెరచి చూడగా ఎండిన మొగ్గల మిశ్రమంగా కలిగి ఘాటైన వాసన వస్తుండగా ఈ పదార్థం ఏమిటని అడుగగా వారు ఎండు గంజాయని తెలిపారు.గంజాయిని తూకము వేయగా, అది 20 గ్రాములు ఉందని, సురేష్ వద్ద గల వీవో కంపెనీకి చెందిన నలుపు రంగు మొబైల్ ఫోన్ దాని నెంబర్ 7569132692 ఐఎంఈఐ నెంబర్ 867663044190293 867663044190285 తీసుకొని రావడం జరిగినదనీ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినదని, నెరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన దేవరుప్పుల ఎస్సై సృజన్ కుమార్ ను వారి సిబ్బందిని డీసీపీ రాజమహేంద్ర నాయక్,ఏసీబీ అంబటి నరసయ్య సీఐ జానకిరామ్ రెడ్డి అను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొడకండ్ల ఎస్సై రాజు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version