ప్రశ్న ఆయుధం న్యూస్( జూన్ 7)
వేంసూరు మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో కోళ్ల వ్యాన్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు.ఒకరికి గాయాలు పాలు కాగా, వివరాల్లోకెళ్తే భరణి పాడు గ్రామానికి చెందిన మల్లెపూల సాత్విక్ వయస్సు 22, సురటి జగదీష్ 22, విస్సంపల్లి రాంబాబు 23, ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తుండగా, అటుగా వస్తున్న కోళ్ల వ్యాన్, ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, సాత్విక్ అక్కడే పడి తీవ్ర గాయాలతో చనిపోయాడు, జగదీష్ మార్గం మధ్యలో వెళుతుండగా చనిపోయాడు. రాంబాబుకు తీవ్ర గాయాలు కాగా, ఖమ్మం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వేంసూరు ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని, వ్యాన్ డ్రైవర్ మీద కేసు నమోదు చేసి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
కందుకూరు లో వ్యాన్ డికొని ఇద్దరు యువకులు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.

Oplus_131072