*హాస్టల్ వార్డెన్ వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగి ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం*
సత్తెనపల్లిలో వెంకటపతి కాలనీలోని హాస్టల్లో మాత్రలు మింగి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
హాస్టల్ వార్డెన్ వేధింపుల వల్లనే విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.
భోజనం బాగోలేదని కంప్లైంట్ ఇచ్చినందుకు ఏదో వంకతో వార్డెన్ టార్చర్ పెడుతున్నారన్నారు.
వార్డెన్ తీరుపై 2రోజుల క్రితం విద్యార్థినుల తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.