Site icon PRASHNA AYUDHAM

ఏకగ్రీవంగా టి ఎన్ జి ఓస్ ఖమ్మం నగర యూనిట్ ఎన్నికలు..

IMG 20241021 WA0012 1

ఏకగ్రీవంగా టి ఎన్ జి ఓస్ ఖమ్మం నగర యూనిట్ ఎన్నికలు..

-యూనియన్ లో పదవి మరింత భాద్యత పెంచుతుంది

ఖమ్మం జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:

టి ఎన్ జి ఓస్ యూనియన్ కేంద్రసంఘం ఆదేశాలమేరకు జిల్లా ఆడహాక్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం టి ఎన్ జి ఓస్ ఖమ్మం నగర యూనిట్ ఎన్నికలు ఖమ్మం టీఎన్జీవోస్ ఆఫీసులో జరిగాయి.
ఈ ఖమ్మం నగర యూనిట్ ఎన్నికలకు గానూ పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రాయల నరసింహారావు
ఎన్నికల అధికారిగా వ్యవహారించారు.
గత వారం రోజుల ప్రక్రియ అనంతరం నామినేషన్లు ఏమీ రాకపోవడం, సింగిల్ సెట్ నామినేషన్లు రావడంతో కార్యవర్గం ఎన్నిక మొత్తం ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఖమ్మం నగర యూనిట్ అధ్యక్షునిగా చింతల రమణ యాదవ్ , కార్యదర్శిగా
పోలవరపు వీరాంజనేయులు కోశాధికారిగా కొప్పుల దిలీప్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే , వారితో పాటుగా మరో 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారి వెల్లడించారు.
ఎండి రఫీ,
నెల్లూరి రవికుమార్,
ఎం .శ్వేత
కే .ప్రసన్నకుమార్
వి .శంకర్రావు
టీ .కాంతారావు
ఐ. కిరణ్ కుమార్
ఎం .ఉదయ్ భాస్కర్ ఎస్. శ్రావణి,
ఎన్. పృద్వి,
కే. పవన్ కుమార్ సిహెచ్, ప్రవీణ్ యూనిట్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ఈ కమిటీ పదవీ కాలం 2024 నుండి 2027 సంవత్సరం వరకు మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు ఎన్నికల అధికారి ఎన్నిక పత్రాన్ని అందజేశారు. ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించినందుకు అయన కమిటీ సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి…
నూతన కార్యవర్గానికి అభినందనలు…
ఏకగ్రీవంగా ఎన్నికైన నగర యూనిట్ కార్యవర్గాన్ని జిల్లా కో కన్వీనర్ కొణిదెన శ్రీనివాస్,
టి ఎన్ జి ఓస్ యూనియన్ మాజీ కార్యదర్శి, గoగవరపు బాలకృష్ణ నూతన కమిటీ సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.యూనియన్ లో పదవి చేపట్టడమంటే భాద్యత పెరిగిందని గుర్తేరగాలన్నారు. ప్రతీ ఉద్యోగి సమస్యను తెలుసుకొని వారికి అండగా నిలబడాలని సూచించారు. నాయకుడన్నవాడు నిరంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని, తద్వారా యూనియన్ బలోపేతమవుతోందన్నారు.. ఈ కార్యక్రమంలో ఆడహాక్ కమిటీ సభ్యులు జడ్. ఎస్ .జయపాల్,
గుంటుపల్లి శ్రీనివాస్, కొమరగిరి దుర్గాప్రసాద్, ఎర్రా రమేష్,ఆయుష్ ప్రకాష్,తాళ్లూరి శ్రీకాంత్, బుసా చంద్ర శేఖర్ ,పెద్దీనేని రాధా కృష్ణ, ముఖీథ్, మన్మధరావు నాయకులు పాల్గొన్నారు…

Exit mobile version