హైడ్రా’తో కాంగ్రెస్ తలగొక్కోంటోంది
మూసీ’ హైడ్రా కూల్చివేతలు, 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు నిధులే కాంగ్రెస్ కొంప ముంచబోతున్నయ్..
కాంగ్రెస్ పై మెడలొంచేందుకు పోరాటాలు చేస్తాం
స్థానిక ఎన్నికల తరువాత స్థానిక ప్రజా ప్రతినిధులతో
ఛలోహైదరాబాద్ మార్చ్ నిర్వహిస్తాం..
జగన్ అబ్దుల్ కలాం కంటే తోపా?
రాష్ట్రపతి హోదాలోనే కలాం డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకున్నరు
జగన్ తీరు చూస్తుంటే లడ్డూలను కల్తీ చేసినట్లు కన్పిస్తోంది
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్
హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ తల గోక్కొంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణ పేరుతో మూసీ చుట్టపక్కల నున్న పేద హిందువుల ఇండ్లను కూల్చివేసేందుకు కాంగ్రెస్ సిధ్ధమైందన్నారు. మలక్ పేట రేసు కోర్సు నుండి ముసారాంబాగ్ వరకు మూసీ స్థలాలను ఒవైసీ అనుచరులు కబ్జాలు చేసుకున్నారని, వాటిని టచ్ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. పేదల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని, మూసీ హైడ్రాతోపాటు 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు బిల్లుల అంశాలే కాంగ్రెస్ పార్టీకి కొరవి పెట్టబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు దమ్ముంటే ఈ మూడు అంశాలపై ఎన్నికల్లోకి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈరోజు హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. హైడ్రా దుశ్చర్యలవల్ల రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉందని, ఆర్దిక వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు..కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో తల గొక్కోంటోంది. ప్రజలతో ఆటలాడుతోంది. ఏళ్ల తరబడి అన్ని అనుమతులు తీసుకుని, పన్నులు కడుతూ, బ్యాంకు లోన్లు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే కూల్చి వేయడం ఎంత వరకు కరెక్ట్? హైడ్రా కూల్చివేతలవల్ల ప్రజలు కారుస్తున్న కన్నీళ్లు మీకు గుర్తుకు రావడం లేదా? ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో మళ్లీ పేదల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమైర్రు. జియాగూడలో దళిత సోదరులుండే ఇండ్లను కూల్చడానికి హైడ్రా వెళతది. చాదర్ ఘాట్ లో ఉండే హిందువుల ఇండ్ల వద్దకు పోయి కూలగొడతమని బెదిరిస్తది. మరి ఎంఐఎం గూండాలు, ఒక వర్గం వాళ్లు మూసీని చెరబట్టి కట్టుకున్న ఇండ్లను, షెడ్లను, బిల్డింగులను ఎందుకు టచ్ చేయడం లేదు? నేనడుగుతున్నా… ఒవైసీని టచ్ చేసే దమ్ముందా? కనీసం మూసీ వెంట ఉన్న ముస్లిం ఇండ్లను కూల్చే దమ్ముందా? రజకార్ల ముఠా పార్టీ ఎంఐఎం ఉన్నంత కాలం ఓల్డ్ సిటీ న్యూ సిటీ కాలేదు. ఒక వర్గం ఓట్ల కోసం ఒవైసీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ సాగిలపడుతున్నయ్. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒవైసీ సోదరులు చెరువును ఆక్రమించి నిర్మించిన బిల్డింగులను ఎందుకు కూలగొట్టడం లేదు? ఇయాళ మూసీని ఆనుకుని ఉన్నారని న్యూమారుతీనగర్, చాదర్ ఘాట్, లంగర్ హౌజ్ లోని పేదల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి…. అదే మూసీని అనుకుని మలక్ పేట్ రేసు కోర్సు నుండి మూసారాంబాగ్ వరకు ఒవైసీ అనుచరులు ఆక్రమించుకున్న స్థలాలు, కట్టుకున్న బిల్డింగులు, ఇండ్లను కూల్చే దమ్ముందా?మూసీ సుందరీకరణ పెద్ద బోగస్… గత 30 ఏళ్ల నుండి ఈ మాటలు వింటూనే ఉన్నం. మూసీ ప్రక్షాళన పేరుతో ఒకసారి జపాన్ నిధులు తెచ్చిర్రు… ఇంకోసారి జమైకా నిధులు ఖర్చు చేసిర్రు. ఒకాయన ఏకంగా హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తానన్నడు… చివరకు ఏమైంది? అదే మూసీ, అదే కంపూ… తెచ్చిన నిధులు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి పోతే… మూసీ కంపు బారిన పడి హైదరాబాద్ ప్రజలు రోగాలతో ఆసుపత్రి పాలైతున్నరు. నేనడుగుతున్నా జీతాలకే పైసల్లేక అల్లాడుతున్న ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకుండా చేతులెత్తేసింది…. అట్లాంటిది మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు యాడ నుండి తీసుకొస్తరు? కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు చేసి జనం నెత్తిన శఠ గోపం పెట్టిండు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో మరో లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి జనం నడ్డి విరిచేందుకు సిద్ధమైంది…అన్యమతస్తులు తిరుమల వెళితే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. జగన్ క్రిస్టియన్. కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు డిక్లరేషన్ సమర్పించారు. జగన్ అంతకంటే ఎక్కువా? దీనిపై రాజకీయాలెందుకు? ఇవ్వకుంటే దేవుడిపై విశ్వాసం లేనట్లే. గతంలో జగన్ హిందువుల ఓట్ల కోసమే తిరుమల వెళ్లినట్లు అన్పిస్తోంది. మక్కామసీదు, వాటికన్ సిటీ నిబంధనలకు విరుద్ధంగా హిందువులను అనుమతిస్తారా? ఇవ్వరు కదా? మరి తిరుమల విషయంలో రాజకీయాలెందుకు? హిందువులంటే అంత చులకనా? మత విశ్వాసాలతో చెలగాటమాడటం సరికాదు. దళితులను తిరుమలకు రానివ్వట్లేరంటూ జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారు. దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులు. తిరుమలలో కులం, వర్ణం, వర్గం తేడా లేకుండా హిందువులంతా తిరుమలను దర్శించుకుంటారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని నివేదికలు తేల్చితే… చర్యలకు డిమాండ్ చేయాల్సిన ప్రతిపక్ష నాయకులు.. ఆవు నెయ్యి కంటే పంది, ఎద్దు నెయ్యి ఖరీదు ఎక్కువని.. అట్లాంటిది లడ్డూలో వాటిని ఎట్లా కలుపుతారని మాట్లాడటం సిగ్గు చేటు. వైసీపీ నేత, అడ్వోకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అట. ఆయన వితండ వాదం, జగన్ తీరును చేస్తూ తిరుమల శ్రీవారి లడ్డూల్లో కల్తీ జరిగినట్లు అనుమానం కలుగుతోంది. కల్తీ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. సెక్యూలర్ వాదులుగా చెప్పుకునే కుహానా లౌకిక వాదులు తిరుమల అంశంపై ఎందుకు స్పందించడం లేదు? కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు విసిగిపోయారు. ముఖ్యంగా హైడ్రా దాడులు, ముసీ ప్రక్షాళన పేదల ఇండ్ల కూల్చివేత, 6 గ్యారంటీల అమలులో వైఫల్యం, మాజీ సర్పంచులకు బిల్లులివ్వకుండా వేధించడంవంటి అంశాలే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కొంప ముంచబోతున్నయ్. బీఆర్ఎస్ పాలనలోనూ కేసీఆర్ సర్పంచుల ఉసురు పోసుకున్నారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యడం లేదు. కేంద్రమే ప్రతి పైసా అందిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మాజీ సర్పంచులు, స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే వాళ్లంతా బీజేపీకి అండగా నిలబడాలని కోరుతున్నా. ఎన్నికల తరువాత గెలిచిన సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులందరితో కలిసి ‘ఛలో హైదరాబాద్’ పేరుతో మార్చ్ నిర్వహిస్తాం. కాంగ్రెస్ మెడలొంచి బిల్లులు వచ్చేలా చేస్తాం.. పంచాయతీలను నిధులందేలా చేస్తాం. అందుకోసం ఎన్ని పోరాటాలు చేసేందుకైనా బీజేపీ సిద్ధంగా ఉంది.