Site icon PRASHNA AYUDHAM

కరీంనగర్-తిరుపతి ట్రైన్ కు కృషి చేసిన కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రి పొన్నంకు ధన్యవాదాలు

IMG 20250613 WA2342

*కరీంనగర్-తిరుపతి ట్రైన్ కు కృషి చేసిన కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రి పొన్నంకు ధన్యవాదాలు*

*కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం వోడితల ప్రణవ్*

*జమ్మికుంట జూన్ 13 ప్రశ్న ఆయుధం*

ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో ప్రజల సౌకర్యార్థం కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ సదుపాయాన్ని వారానికి రెండు సార్లు నడిపేలా అనేక మార్లు కేంద్రానికి విజ్ఞాపన చేసి,కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు,కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవి,స్ధానిక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ కు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ హుజురాబాద్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.గతంలో ఎంపీగా ఉన్న సమయంలో పొన్నం జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేశారని,కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జమ్మికుంట రైల్వే స్టేషన్ ను మోడల్ రైల్వే స్టేషన్ గా మార్చి ఆధునీకరణ చేశారని ప్రస్తుతం ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గా ఉన్న బండి సంజయ్ రైల్వే స్టేషన్ ల అభివృద్ధికి తగిన నిధులు తీసుకురావాలని మరిన్ని ట్రైన్ సర్వీసులు జమ్మికుంట లో ఆగేలా చూడాలని,అలాగే నిత్యం ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నీ త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version