ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై సీఎం కు తహసీల్దార్ ల ద్వార యూఎస్బీ యు ఎస్ పి సి వినతిపత్రం  

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై సీఎం కు తహసీల్దార్ ల ద్వార యూఎస్బీ యు ఎస్ పి సి వినతిపత్రం

కామారెడ్డి – ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి జిల్లాలోని వివిధ మండలాల తాసిల్దార్ ద్వారా యూఎస్బి యు ఎస్ పి సి వినతిపత్రలను అందించడం జరుగుతుందని టిపిటిఎఫ్ నాయకులు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేసి, ఈనెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని, అర్వతలేని డీఈఓ లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని, ఉపాధ్యాయుల పెన్షనర్ల, వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రాథమిక పాఠశాలలకు 5571 పియస్‌ హెచ్‌యం పోస్టులను మంజూరు చేయాలని, పండిట్, పిఈటిల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జిఒ 2,3,9,10 లను రద్దు చేసి జిఒ 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని, వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని, కెజిబివి, మోడల్‌ స్కూల్స్‌ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, కే జి బి వి, యూ ఆర్ ఎస్, సమగ్ర శిక్ష, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, మోడల్ స్కూల్, గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలలోని పండిట్, పిఇటి పోస్టులను అప్ గ్రేడ్ చేసి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలనే ఉత్తర్వులను ఉపసంహారించాలని, విద్యారంగంలో ఎన్ జి ఓ జోక్యాన్ని నివరించాలని, అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాంట్స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, రాజేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment