హై కమిషనర్ పసుపులేటికి సత్కరించిన ఎంపీ వద్ది రాజు

హై కమిషనర్
Headlines
  1. వద్దిరాజు రవిచంద్ర, గ్రెనడా హై కమిషనర్ పసుపులేటి గీతా కిషోర్ కుమార్ ను శాలువాతో సత్కరించారు
  2. గ్రెనడాకు చెందిన పసుపులేటి గీతా కిషోర్ కుమార్ హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులతో సమావేశం
  3. పసుపులేటి గీతా కిషోర్: గ్రెనడా దేశం తరపున భారతదేశానికి దౌత్యవేత్తగా
  4. ఇంగ్లాండ్ చక్రవర్తి చార్లెస్ ద్వారా గీతా కిషోర్ కి ‘ఎంబీఈ’ బిరుదు
  5. ఇండియా-గ్రెనడా సంబంధాలను పెంచడంలో గీతా కిషోర్ యొక్క కృషి
ప్రశ్న ఆయుధo న్యూస్ డిసెంబర్ 8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మనదేశంలో గ్రెనడా హై కమిషనర్ పసుపులేటి గీతా కిషోర్ కుమార్ ను శాలువాతో సత్కరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన ఆయన హైదరాబాద్ నిజాం కళాశాలలో డిగ్రీ చదివి 45ఏళ్ల కిందట గ్రెనడా వెళ్లి వ్యాపారాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు.వ్యాపార,సేవా రంగాలలో గీతా కిషోర్ కృషిని కొనియాడుతూ ఇంగ్లాండ్ చక్రవర్తి చార్లెస్ మెంబర్ ఆఫ్ బ్రిటీష్ ఎంప్తెర్ (ఎంబీఈ) బిరుదుతో గౌరవించారు.గ్రెనడాకు 1974లో స్వాతంత్ర్యం సిద్ధించినా,ఇంకా కూడా ఇంగ్లాండ్ మోనార్కీ కిందనే కొనసాగుతున్నది.ఆయన పుట్టి పెరిగిన ఇండియాకు తమ గ్రెనడా దేశం తరపున దౌత్యవేత్తగా పంపడం విశేషం.గీతా కిషోర్ నియమాకం పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ ఇది చాలా అరుదైన సందర్భమని వ్యాఖ్యానించడం జరిగింది.గీతా కిషోర్ తన తెలంగాణ పర్యటన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఎంపీ రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా హైకమిషనర్ పసుపులేటిని ఎంపీ వద్దిరాజు తన సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్,ఆది విష్ణుమూర్తి,ముద్దు వినోద్,ఆకుల రజిత్ కుమార్,ఊసా రఘు, చెరుకూరి శేషగిరిరావు తదితరులతో కలిసి శాలువాతో సత్కరించారు,కొద్దిసేపు ఇష్టాగోష్టి జరిగింది.

Join WhatsApp

Join Now