కె పి హెచ్ బి కాలనీలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

కె పి హెచ్ బి కాలనీలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు _ బండి రమేష్ మరియు శేరి సతీష్ రెడ్డి 

 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17: కూకట్‌పల్లి ప్రతినిధి 

 

గురు ప్రపంచంలోనే వాల్మీకి మహర్షి ఆదర్శప్రాయలు

 

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు 

 

శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా 

 జరిగిన వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ,వాల్మీకి సోదరులకు వాల్మీకి మహర్షి జయంతి తెలుపుతూ ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణం రచించారని, మనం ఏదో సందర్భంలో రామాయణం గురించి ఆ సీతారాముల గురించి ప్రపంచానికి తెలియజేశారు. అలాంటి మహర్షి జయంతి ఒక పండగ వాతావరణం నెలకొంటుందన్నారు, ప్రతి ఒక్కరూ భక్తి భావంతో దేవుని అనుగ్రహం ఉన్న ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఆ పనిలో విజయం కలుగుతుంది తెలిపారు.కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి పాల్గొని నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో పండగ వాతావరణం నెలకొందని, వాల్మీకి మహర్షికి పూజించుకొని 

అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వాల్మీకి మహర్షి ఆశీస్సులతో ఉండాలని శేరి సతీష్ రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమము రంగస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు తమ్మినేని ప్రవీణ్ కుమార్ ఫణీంద్ర కుమార్ పొడుగు అప్పారావు వాల్మీకి అసోసియేషన్ సభ్యులు మరియు నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now