Site icon PRASHNA AYUDHAM

వాల్మీకి జయంతి వేడుకలు

IMG 20241017 WA0115

మహర్షి వాల్మీకి గొప్ప కవి అని తత్వవేత్త గా పేరుగడించారు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:

 

మహర్షి వాల్మీకి గొప్ప కవి అని తత్వవేత్త గా పేరుగడించారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతినీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా ప్రకటించినందున గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహర్షి వాల్మీకి జయంతి ఆశ్వీయుజ పౌర్ణమి రోజున నిర్వహించుకోవడం జరుగుతున్నదని తెలిపారు. మహర్షి వాల్మీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఒక కవి గా, తత్వవేత్తగా పెరుగడించారని, మహర్షి వాల్మీకిని ఆదికవిగా అభివర్ణిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version