*”పి.ఏ.ఏ.పి” జిల్లా అధ్యక్షులుగా వంగల దాలి నాయుడు*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 23(ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
: విద్యార్థుల సమస్యల పరిష్కారానికై కమిటీలు, లీగల్ సెల్ ఏర్పాటు చేయాలి
: ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (పి. ఏ. ఏ. పి) రాష్ట్ర అధ్యక్షులు శిఖరం నరహరి
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పి.ఏ.ఏ.పి) పార్వతీపురం మండలం జిల్లా అధ్యక్షులుగా వంగల దాలినాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షులు శిఖరం నరహరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్యలు ఆదివారం నియామక పత్రం అందజేసి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులుగా నియమించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా లో గల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ విద్యాసంస్థల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి పెట్టి విద్యార్థుల సమస్యల పట్ల స్పందించాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రులతో లీగల్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా తగు తగువిధంగా పోరాటం చేయాలన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న విద్యాసంస్థలపై న్యాయపరమైన పోరాటం చేయాలన్నారు. ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నియమ నిబంధనలు అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వంగల దాలినాయుడు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి, తనకు అప్పగించిన బాధ్యతలను శాయిశక్తులా నిర్వర్తిస్తానన్నారు. జిల్లాలో విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.